NewsInn

News in a Click

రాష్ట్రం ప్ర‌భుత్వం చిల్ల‌ర గా మారింది-కేసీఆర్

రాష్ట్రం ప్ర‌భుత్వం చిల్ల‌ర గా మారింది-కేసీఆర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనడం కూడా చేతకావడం లేద‌న్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేద‌ని ప్రజలు ఆవేదన చెందుతున్నార‌న్నారు. ఇది ఒక చిల్లర ప్రభుత్వం అని ఆరోపించారు. ప్ర‌భుత్వంలో ఉన్న వాళ్లు మాట్లాడే మాట‌లేనా అవి అని దుయ్యబట్టారు. తెలంగాణా భ‌వ‌న్ లో బీఆర్ ఎస్ రజ‌తోత్స‌వాల ముగింపు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌తినిధుల స‌మావేశంలో కేసీఆర్ తాజా రాజ‌కీయాల‌పై స్పందించారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో బెంగుళూరు ఎంపీ తేజ‌స్వీ సూర్య చేసిన వ్యాఖ్య‌ల‌పై మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్లో ఇష్టాను సారంగా బీజేపీ ఎంపీ మాట్లాడినా…. కాంగ్రెస్ ఎంపీలు సైలెంట్ గా ఉండ‌డం శోచ‌నీయం అని పించింద‌న్నారు. పార్ల‌మెంట్ లో బీఆర్ ఎస్ ఎంపీలు ఉన్న‌ట్ల‌యితే తేజస్వీ వ్యాఖ్య‌ల‌పై ర‌ణ‌రంగం సృష్టించే వాళ్ల‌ని కేసీఆర్ వ్యాఖ్య‌లు చేశారు. కాళేశ్వ‌రంలో రాజ్య‌స‌భ‌లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిలో మాట్లాడిన మాట‌ల‌కు బీఆర్ ఎస్ ప‌క్ష నేత సురేష్ రెడ్డి ఎంతో సీరియ‌స్ గా స్పందిచార‌న్నారు. బీజేపీ ఎంపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తనను ఎన్నోసార్లు, ఎంతో మంది మానసిక క్షోభకు గురిచేశారన్న కేసీఆర్‌, హైదరాబాద్ విషయంలో రాజీపడాలని సోనియాగాంధీ ఎన్నోసార్లు చెప్పారని గుర్తుచేశారు. సోనియాగాంధీ చెప్పినా తాను రాజీపడలేదని, అది తన చిత్తశుద్ధి అని స్పష్టం చేశారు.

ఓట‌మిపై ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి….

తెలంగాణాలో ప‌దేళ్ల పాటు అధికారంలో ఉండి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసినా….అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఎందుకు చెందామో అన్న దానిపై ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో బీఆర్ ఎస్ స‌భ్య‌త్వం దాదాపు 60 ల‌క్ష‌లుగా ఉంద‌న్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే స‌భ్య‌త్వంలో రాశి కంటే వాసి ముఖ్య‌మని తేలిపోయింద‌ని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని, ప్రజలు విసుగు చెందారని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.పార్టీ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన కేటీఆర్

కమిటీల రద్దు…….

బీఆర్ ఎస్ రాష్ట్ర క‌మిటీల‌తో పాటు అన్ని కమిటీలు రద్దు చేస్తున్న‌ట్లు కేసీఆర్ ఈ స‌మావేశంలోనే ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో స‌భ్య‌త్వ న‌మోదు చేప‌ట్టి ఆ త‌రువాత అన్ని క‌మిటీల‌ను మ‌ళ్లీ నియ‌మిస్తామ‌న్నారు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేపట్టనున్నట్లు తెలిపారు. స‌భ్య‌త్వ న‌మోదు అనంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలో 200 మంది కార్య‌క‌ర్త‌ల‌కు శిక్ష‌ణా శిబిరాల‌ను నిర్వ‌హిస్తామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో సాధారణ సభ్యత్వానికి రూ.10 రుసుము, క్రియాశీల సభ్యత్వానికి రూ.50లుగా నిర్ణయించారు.సభ్యత్వం కోసం ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగిస్తామ‌న్నారు.

రైతుల‌కు అండాగా ఉండాలి….

రాష్ట్రంలో రైతులు పండించిన పంట‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల‌ని బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ స‌మావేశంలో తీర్మానం చేసింది. మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పంటల కొనుగోళ్లపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులకు పూర్తి అండగా నిలవాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *