
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా ఉద్యమం సందర్బంగా ఉద్యమాన్ని మద్యలో ఆపివేస్తే….తనను రాళ్లతో కొట్టి చంపాలని ప్రకటించి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లో సంచలనం సృష్టించారు. ఈ నినాదం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడంతో అనూహ్యంగా మద్దతు కూడా కేసీఆర్ కు దక్కింది…తాజాగా తెలంగానా రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత కూడా అదే నినాదాన్ని అందుకున్నారు. పార్టీ ఆవిర్బావం సందర్భంగా పాంచజన్యం పేరుతో ఐదు హామీలను తెలంగాణా రక్షణ సమితి ఎజెండాగా ప్రకటించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తన అభిప్రాయాలను వెల్లడించారు. ఉచిత విద్య, ఉచిత వైద్య, యువత కోసం ఆమె ప్రత్యేకంగా పలు అంశాలను ప్రస్తావించారు. బీఆర్ ఎస్ పార్టీలో తాను ఉన్న రోజుల్లో కొన్ని తప్పులు జరిగాయని ఆ తప్పుల్లో తన భాగస్వామ్యం ఉన్నందుకు మరోసారి క్షమాపణలు చెబుతున్నానన్నారు. తెలంగాణా జాగృతి ఇక తెలంగానా సర్వోదయ పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.తెలంగాణాలో యువతను ప్రోత్సహించే విధంగా తన రాజకీయం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వాల్లో అమ్మతనం లోపిస్తుందని, అమ్మ తనంతో తెలంగాణాలో పాలన సాగితే అన్ని వర్గాలు తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాజకీయం కంటే ఎక్కువ క్రీడల్లో రాజకీయం నడుస్తుందన్నారు.








Leave a Reply