NewsInn

News in a Click

ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కారిస్తాం- సీఎం

ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కారిస్తాం- సీఎం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే పీఆర్పీ నివేదిక తెప్పించుకొని అమలు చేయడం తో పాటు జూన్ 1వ తేదీ నుంచి హెల్త్ కార్డులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి శ‌నివారం త‌న క్యాంపు కార్యాల‌యంలో ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశమైయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఉద్యోగుల పై హామీల వర్షం కురిపించారు. ఇందులో ప్రధానంగా 100 రోజుల్లో పెన్షనర్స్ కు రూ.6వేల కోట్లను విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి రెండు నేలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నిర్వహించి ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 45 స‌మ‌స్య‌ల‌ను టీజీఈ జేఏసీ చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ వోడ్నాల రాజ‌శేఖ‌ర్, టీజీఈ జేఏసీ భాగ‌స్వామ్య ప‌క్ష ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంటింజెంట్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివ‌రించారు. ఉద్యోగుల ప్ర‌ధాన స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, త‌ద్వారా ప్ర‌భుత్వంపై ప‌డుతున్న ఆర్థిక భారం, స‌త్వ‌రం ప‌రిష్క‌రించాల్సిన స‌మ‌స్య‌ల‌పై ఆర్థిక శాఖ అధికారుల‌తోను సీఎం చ‌ర్చించారు. ప్ర‌భుత్వంపై ఆర్థిక భారం ప‌డినా ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌ట్ల ప్ర‌జా ప్ర‌భుత్వం సానుకూల నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని, ఉద్యోగుల న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు షురూ చేసింద‌ని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌న్నింటిని ప్రాధాన్య‌త క్ర‌మంలో ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హామీ ఇచ్చారని టీజీఈ జేఏసీ చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *