
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా వ్యాప్తంగా భానుడి ప్రతాపం జోరుగా కనిపిస్తోంది. తెలంగాణాలో అత్యధికంగా 46 డిగ్రీల ఊష్ణోగ్రత నిజామాబాద్ లో నమోదైంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాలో 45.9 డిగ్రీలు,ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.హైదరాబాద్ లో దాదాపు 43 డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం వరకు ఊష్ణోగ్రతల తీవ్రత ఉంటుందని ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో రెండు రోజుల తరువాత వాతావరణం క్రమంగా చల్లబడుతుందని వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు అందిస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలపైనే ఊష్ణోగ్రతలు శనివారం నమోదయ్యాయి.వడగాలుల తీవ్రత కూడా సోమవారం నుంచి తగ్గే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తోంది.
ఆదివారం రోజు ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, యాదాద్రి – భోంగిర్, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాలు, పెద్దపల్లి మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఉరుములు ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా. వడగాలులు, తుఫాను ప్రభావంతో రేపు తెలంగాణాలో అక్కడక్కడా వర్షాలు పడే చాన్స్ ఉందని అంచనా….. 6వ తేదీ నుంచి మాత్రం హైదరాబాద్ లో వాతావరణ చల్లబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.








Leave a Reply