(తిరుమల,న్యూస్ఇన్)
తిరుమలలో నెలకొన్న భారీ రద్దు దృష్యా స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులను కొన్ని మీడియా సంస్థలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలను మానుకోవాలని టీటీడీ కోరింది. వేసవి సెలవులు కావడంతో స్వామి వారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని, స్వామివారి దర్శనానికి తమ వంతు వచ్చేవరకు సంయమనంతో వేచి ఉండాలని సూచించింది. కొన్ని మీడియా సంస్థలు అసథ్య కథనాలను ప్రసారం చేస్తూ భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నాయని టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా స్వామివారి దర్శనానికి తమ వంతు వచ్చేవరకు సంయమనంతో వేచి ఉండాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.వేసవి సెలవులకు తోడు వారాంతం కూడా రావడంతో శనివారం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు క్యూలైన్లలోని భక్తులను రెచ్చగొట్టి వారి అభిప్రాయాలను తీసుకుని ప్రచారం చేయడాన్ని ఖండించింది.సర్వ దర్శన క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేయడం జరుగుతోంది. భక్తులకు అన్నీ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. శనివారం రోజే 91 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది.






Leave a Reply