(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఏ తల్లి అయినా పిల్లలను క్రమశిక్షణతో పెంచి ఉన్నత స్థానాలకు చేరుకునేలా తీర్చి దిద్దుతుంది. ఎంత పేదరికంలో ఉన్నా….పిల్లలు తప్పటడుగులు వేస్తే అందరికంటే ముందుగానే తల్లి దండ్రులు శిక్షిస్తారు. కానీ హైదరాబాద్ లో వెలుగు చూసి ఈ కేసులో తల్లి పిల్లలను తప్పుదారిలో వెళుతుంటే వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి…వారికి సహకరించడం మొదలు పెట్టింది. ఉన్నత ఆదాయ వర్గాల కుటుంబాల ఆడపిల్లను ట్రాప్ చేసేందుకు తల్లి ఆ కొడుకులకు పూర్తిగా సహకరంచింది.

ఇక తల్లి సహకరాంతో కొడుకులు కూడా హద్దులు లేకుండా వ్యవహరించడం మొదలు పెట్టారు. పోకిరీలుగా మారి ఆడపిల్లలను ట్రాప్ చేస్తున్న కొడుకులను తల్లి వెనుకేసుకుని వచ్చింది. ఉన్నత వర్గాల ఆడ పిల్లల నుంచి డబ్బులు గుంజే ప్లాన్ కు పూర్తిగా సహకరించింది. తల్లి, కొడుకులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు సహకరిస్తూ వచ్చారు.

నగరంలో వెలుగు చూసిన ఈ వ్యవహారం విస్తు గొలుపుతోంది. సమాజంలో ఇలాంటి కొడుకులకు సహకరించే తల్లులు కూడా ఉంటారా అన్న విధంగా పరిస్థితి మారింది. అర్జున్, రాజీవ్ లు ఇన్ స్టా గ్రాం రీల్స్ చేస్తూ….ప్రముఖుల అమ్మాయిల టార్గెట్ గా మార్కెటింగ్ చేసుకునే వారు. అమ్మాయిలు ఎవరైనా వారి బ్యాక్ గ్రౌండ్ పై ఆరా తీసిన తరువాతే ఆ సోదరులు ముందుకు వెళ్లే వారు. ఈ వ్యవహారంలో క్రమంగా అన్నదమ్ములిద్దరు రాటు దేలేందుకు వారి తల్లి పూర్తిగా సహకరించింది. ప్రముఖులు, ఉన్నత వర్గాలకు చెందిన అమ్మాయిలను ట్రాప్ చేసి అర్జన్, రాజీవ్ లు కూడా హై ప్రొఫైల్ ఉన్నట్లు వారి దగ్గర నటించే వారు. వీరి ట్రాప్ లో పడిన అమ్మాయిలను లగ్జరీ కార్లలో తిరుగుతూ సన్నిహితంగా మెలుగుతూ వీడియోలు తీసుకునే వారు. కొంత మందిపై లైంగిక దాడులకు కూడా పాల్పడే వారిని పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలు తమ ఫోన్లలో ఉంచుకుని ఆ అమ్మాయిలను బ్లాక్ మేయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, వెనుకేసు కోవడం ఈ అన్న దమ్ముల వృత్తిగా మారింది. పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ సోదరులను అరెస్టు చేసి విచారించారు. అర్జున్, రాజీవ్ లు ఇచ్చిన సమాచారంతో వారి తల్లిని, మేనమామను అరెస్టు చేశారు. మరికొంత మంది పోకిరీలు కూడా ఈ గ్యాంగ్ లో సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలోని నలుగురు యువకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.










Leave a Reply