NewsInn

News in a Click

హెచ్పీఎస్ లో అక్ర‌మాలు-క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

హెచ్పీఎస్ లో అక్ర‌మాలు-క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలోనే ప్ర‌ముఖ విద్యా సంస్థ‌గా గుర్తింపు ఉన్న హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ క్ర‌మంగా వివాదాల్లో చిక్కుకుంటుంది. గ‌తంలో హెచ్ పీ ఎస్ మేనేజ్ మెంట్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చినా..ఎవ‌రు ప‌ట్టించుకోలేదు. తాజాగా మ‌రోసారి టీఆర్ ఎస్ అధ్యక్షురాలు క‌విత హెచ్ పీఎస్ లో జ‌రుగుతున్న కుట్ర‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు. నాణ్య‌మైన విద్య- ఫీజుల నియంత్రణ అంశంపై జ‌రిగిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌ముఖ విద్యా సంస్థ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ప‌లు అంశాల‌ను వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బంధువులు హెచ్ పీ ఎస్ మేనేజ్ క‌మిటీలో ఉండ‌డంతో అక్ర‌మాలుకు సీఎం స‌హ‌క‌రిస్తున్నార‌న్న అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఈ పాఠ‌శాల ప్ర‌భుత్వ స్థ‌లంలోనే ఉన్నా…. ఈ ఏడాది 120 శాతం పీజుల‌ను పెంచార‌ని ఇది ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. ఈ పాఠ‌శాల ప‌రిధిలో ఉన్న 30 ఎక‌రాల భూమిని కొట్టేసే య‌త్నాలు మొద‌ల‌య్యాయ‌ని ఆరోపించారు.

పాఠ‌శాల‌ల ఓ మ‌హిళా 14 ఏళ్లుగా కీల‌క స్థానంలో ఉంటూ అక్ర‌మాలు ఎలా చేయాలో బోర్డులోకి వ‌చ్చిన వారికి నేర్పిస్తుంద్నారు. ఈ పాఠ‌శాల‌లో చ‌దివిన ఎంతో మంది ఉన్న‌త స్థానాల్లో ఉన్నార‌ని వారంతా పాఠ‌శాల‌కు ఇచ్చే డొనేష‌న్ల‌కు లెక్క‌లేద‌న్నారు ఇటీవ‌ల స‌త్య‌నాదేళ్ల కూడా భారీ విరాళం ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఇష్టాను సారంగా పెంచుతున్న ఫీజుల‌ను అడ్డుక‌ట్ట వేసేలా ఈ నెల‌లోనే ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వాల‌ని క‌విత డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే ఉచిత విద్య‌, ఉచిత వైద్యం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అమ‌లు చేస్తామ‌న్నారు. ఫీజుల నియంత్ర‌ణ‌కు అన్ని రాజ‌కీయ పార్టీలు ఏక‌మై నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఫీజుల‌ను నియ‌త్రించేందుకు ప్ర‌భుత్వం ఏజ‌న్సీని నియ‌మించాల‌ని లేదంటే గుజ‌రాత్ లో మాదిరి ప్రాథ‌మిక విద్య‌కు 15 వేలు, ఉన్న‌త విద్యకు 25 వేల‌కు మించి ఫీజులు వ‌సూలు చేసేందుకు అనుమంతించ‌రాద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *