(చెన్నై,న్యూస్ఇన్)
నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపిన తమిళ రాజకీయాలకు పులిస్టాప్ పడింది. ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారడం….విజయ దళపతి కావాల్సిన మెజార్టీని సాధించడంతతో సీఎం గా పదవీ బాధ్యతలు తీసుకునేందుకు లైన్ క్లియర్ అయింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి శనివారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 118 స్థానాలు మెజార్టీ సాధించేందుకు అవసరం.

టీవీకే పార్టీ 108 స్థానాలు సాధించి మెజార్టీకి 10 స్థానాలు దూరంగా నిలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. టీవీకే పెద్ద పార్టీగా అవతరించడంతో డీఎంకే తో ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్…వెంటనే టీవీకే కు మద్దతు తెలిపింది. అయినా మరో ఐదు స్థానాలు అసరం అయ్యాయి. పూర్తి మెజార్టీ కోసం టీవీకే నేతలు వామపక్ష పార్టీలు సహా వామపక్ష పార్టీలు సహా వీసీకే పార్టీ మద్దతు కూడగట్టడంలో విజయవంతం అయ్యారు.
దీంతో టీవీకే కు మద్దతు ఇస్తున్న సభ్యుల సంఖ్య 118కి పెరిగింది. ఇక గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ దళపతికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ మూడు రోజుల పాటు తమిళ రాజకీయాల్లో ఊహించిన విధంగా చర్చలు తెరపైకి వచ్చాయి. టీవికేకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం కల్పిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. దీంతో విజయ్ దళపతికి మద్దతు ఇస్తున్న పార్టీలకు మంత్రి పదవులు వరించనున్నారు.
బెంగాల్ లో…..

బెంగాల్ లో సంపూర్ణ మెజార్టీతో అధికారం దక్కించుకున్న కమలనాథులు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. శనివారం రోజు కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని పార్టీ శాసనసభా పక్షం ఎంపిక చేసుకుంది. దీంతో పశ్చిమబంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరనున్నాయి. అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ, పుద్దుచ్చేరిలో రంగస్వామిలు ముఖ్యమంత్రలుగా మరోసారి బాధ్యతలు తీసుకోనున్నారు. కేరళంలో కాంగ్రెస్ మార్క్ ఉత్కంఠ కొంనసాగుతోంది. సీఎం గా ఎవరిని ఎన్నుకోవలన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేసీ వేణుగోపాలన్, సతీషన్ లలో ఒకరికి సీఎం పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జాతీయ రాజకీయాల్లో ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించిన కేసీ వేణుగోపాల్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.









Leave a Reply