NewsInn

News in a Click

తెలంగాణా అభివృద్ధికి మోడీ స‌హ‌క‌రించాలి

తెలంగాణా అభివృద్ధికి మోడీ స‌హ‌క‌రించాలి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణ‌ను దేశంలో మొద‌టి స్థానంలో నిలిపేందుకు మేం ప్ర‌య‌త్నిస్తున్నాం.. కాక‌తీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించేందుకు మోదీ వ‌చ్చారు… తెలంగాణా ప్ర‌భుత్వం తెలంగాణా రైజింగ్ పేరుతో పెట్టుబ‌డులు, అభివృద్ధికి ప్ర‌య‌త్నిస్తున్న తెలంగాణాకు కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కోరారు. అయిదు రాష్ట్రాల ఎన్నిక‌లు ముగిశాయి… ఎన్నిక‌లు పూర్త‌య్యాక అభివృద్ధి ప‌నుల‌కు వ‌చ్చారు..మ‌నం అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సహకారంతో మీరు గుజరాత్ మోడల్‌ను అభివృద్ధి చేశారు.. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే ప‌దేళ్ల‌లో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. దేశంలో ఢిల్లీ, ముంబ‌యి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ ఆరు మ‌హా న‌గ‌రాలున్నాయి. ఈ దేశం ప్ర‌పంచంలో మొద‌టి స్థానంలో ఉండాలంటే, యువ‌త‌కు ఉద్యోగాలు రావాలంటే ఈ మ‌హా న‌గ‌రాలను మ‌రింత అభివృద్ధి చెయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రేవంత్ స‌రిగ్గా విను…..ఎక్క‌డికో తీసుకెళుతా….

ఈ ఆరు మెట్రో నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు త్వరగా లభించేలా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఉండాలి.. నా రాష్ట్రం, నా ప్రజల కోసం సానుకూల నిర్ణయాల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను.. మా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు మీ అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. మూసీ న‌ది, మెట్రో రైలు, రేడియ‌ల్ రోడ్లు, హైద‌రాబాద్‌-మ‌చిలీప‌ట్నం వ‌ర‌కు 12 వ‌రుస‌ల ర‌హ‌దారికి సంబంధించి రెండు గంట‌ల పాటు మీరు స‌మ‌యం కేటాయించి స‌మీక్షించాలని కోరారు.. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప‌నులు, ప్రతిపాదనలు అన్నింటినీ ఈరోజు మీరు ఆమోదిస్తారని తెలంగాణ ప్ర‌జ‌లు ఆశిస్తున్నారు..
దేశం విష‌యంలో మేం మీతో క‌లిసి ఉన్నాం.. మీరు వికసిత్ భారత్ 2047 పైన‌ మాట్లాడి, భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై మాట్లాడిన‌ప్పుడు,మేం మా రాష్ట్ర కోణంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ను దానికి అనుసంధానం చేశామ‌ని సీఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *