NewsInn

News in a Click

మోడీ ప‌ర్య‌ట‌న – మార‌నున్న రాష్ట్ర రాజ‌కీయం

మోడీ ప‌ర్య‌ట‌న – మార‌నున్న రాష్ట్ర రాజ‌కీయం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మూడోసారి ప్ర‌ధాన‌మంత్రిగా మోడీ బాధ్య‌త‌లు తీసుకున్న‌త‌రువాత తొలిసారి రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ప్ర‌ధాన‌మంత్రి హోదాలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్స‌వాలు చేశారు. అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మోడీ పాల్గొనాలి. ప్ర‌ధాన‌మంత్రి షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకోవ‌డం ఇప్పుడు తీవ్ర రాజ‌కీయ చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్డీఏ మిత్ర ప‌క్షాలు అధికారంలోకి వ‌చ్చాయి. ప‌శ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల‌ను ఎన్డీఏ ప‌క్షాలు ద‌క్కించుకున్నాయి. ఇక త‌దుప‌రి టార్గెట్ ను తెలంగాణాగా మార్చుకునేందుకు బీజేపీ ఫోక‌స్ పెట్టింద‌న్న సంకేతాల‌ను ప్ర‌ధాని మోడీ ఇచ్చారు. బ‌హిరంగ స‌భ‌ల‌తో మాట్లాడుతూ బెంగాల్ లాంటి రాష్ట్రంలో బీజేపీ విజ‌యం సాధించింది…ఇక‌మిగిలింది తెలంగాణా, క‌ర్నాట‌క‌నే అన్న సంకేతాలు ఇచ్చారు. రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ మిత్ర‌ప‌క్ష పార్టీలైన తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ల నివాసానికి ప్ర‌ధాని మోడీ వెళ్లేలా ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల నివాల‌కు మోడీ వెళ్ల‌డం హాట్ హాట్ గా మారింది. బాబు, ప‌వ‌న్ ల నివాసానికి వెళ్ల‌డం వెనుక తెలంగాణా రాష్ట్రంలో అధికారమే టార్గెట్ అన్న చ‌ర్చ మొద‌లైంది.

తెలుగుదేశం పార్టీకి ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణాలో క్యాడ‌ర్ ఉంది. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో నేత‌లు పార్టీలు మారినా…ఇప్ప‌టికీ గ్రామీణీ ప్రాంతాల్లో ఆ పార్టీని గుర్తించే వారు, ఆద‌రించే వారు క‌నిపిస్తారు. జ‌న‌సేన కు కూడా తెలంగాణాలో గుర్తింపు ఉంది. బీజేపీ గ్రామ స్థాయి వ‌ర‌కు క్యాడ‌ర్ ను క‌లిగి ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ఏపీలో మాదిరిగా ఇక్క‌డ కూడా రాబోయే ఎన్నిక‌ల్లో కూట‌మి ని ఏర్పాటు చేసి తెలంగాణా రాజ‌కీయాల‌పై ఫోక‌స్ చేయాల‌న్న ల‌క్ష్యంగా బీజేపీ పావులు క‌దుపుతుంద‌ని తెలుస్తోంది. అందులో భాగంగానే హైద‌రాబాద్ లో ఉన్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ ల నివాసానికి మోడీ వెళ్లేలే ప్ర‌ధాని షెడ్యూల్ ఖ‌రారైంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.ఏపీ సీఎం చంద్ర‌బాబుతో గంట‌కు పైగా మోడీ భేటీ అయి రాజ‌కీయ అంశాల‌పైనే చ‌ర్చించారు. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. 2023 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు తెలంగాణాపై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క పోయినా….. ఇక తాజాగా మోడీ స‌హ‌కారం, బీజెపి మిత్ర ప‌క్షంతో రాబోయే ఎన్నిక‌ల నుంచే కూట‌మి తెలంగాణాలో రాజ‌కీయంగా పావులు క‌దిపేందుకు సిద్ధం అయ్యే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు రానున్నాయి. ఈ ఎన్నిక‌ల‌తో కూట‌మి ప్రాథ‌మికంగా త‌మ బ‌లాన్ని నిరూపించుకునేందుకు రంగంలోకి దిగే అవ‌కాశం ఉంది. ఆ త‌రువాత రెండేళ్ల‌కు తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ఎదుర్కునేందుకు గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగానే ముందుకు వెళ్లేలా ప్ర‌ణాళికల‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

రేవంత్ పై మోడీ వ్యంగాస్త్రం….

అయితే ఇప్ప‌టికే జ‌న‌సేన ద‌క్షిణాది రాష్ట్రాలకు విస్తరిస్తామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా దీనికి బ‌లం చేకూరుస్తుంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల‌ను దెబ్బ కొట్టేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని బీజేపీ భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్తి కావ‌డం, ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌జా వ్య‌తిరేక‌త పెరిగింద‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. ఇక బీఆర్ ఎస్ పార్టీ అవినీతి ఆరోప‌ణ‌లు పార్టీ అంత‌ర్గ‌త పోరుతో స‌త‌మ‌తం అవుతోంద‌న్న అభిప్రాయంతో ఉంది. ఈ నేప‌థ్యంలో మూడు పార్టీల కూట‌మిగా తెలంగాణాలో పావులు క‌దిపేందుకు బీజేపీ అగ్ర నాయ‌క‌త్వ ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేసేందుకు పావులు క‌దుపుతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే టీడీపీలో కొన‌సాగుతున్న కీల‌క నేత‌ల‌కు ఈ సంకేతాలు కూడా అందాయి. ఉమ్మ‌డి జిల్లాల వారిగా టీడీపీ నేత‌ల జాబితాను పార్టీ సిద్ధం చేస్తోంది.

ఆ ప్రాంతాల్లో ఇంకా ప్ర‌జ‌ల్లో ఉంటున్న నేత‌ల వివ‌రాల‌ను చంద్ర‌బాబు సేక‌రించారు. కూట‌మిగా పోటీ చేయాల్సి వ‌స్తే ప్ర‌తిపార్ల‌మెంట్ స్థానంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాల‌న్న ల‌క్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారు. ఆ స్థానాల గుర్తింపు కూడా ఉమ్మ‌డి జిల్లాల వారిగా ఇప్ప‌టికే పూర్త‌యింది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానాన్ని ప‌రిశీలిస్తే….నారాయ‌ణ‌పేట‌, షాద్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేయాల‌న్న అభిప్రాయంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు పార్టీ నేత‌లు అంటున్నారు. తెలంగాణా రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత సైలెంట్ గా క్షేత్ర స్థాయిలో పావులు క‌దుపుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు కూట‌మిగా ప్ర‌జ‌ల ముందుకు రావాల‌న్న యోచ‌న‌లో ఎన్డీఏ కూట‌మి నేత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *