
(హైదరాబాద్, న్యూస్ఇన్)
ఎన్నికల సంఘం అమలు చేస్తున్న SIR లోభారత పౌరులు ఎవరూ ఓటు హక్కు కోల్పోరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో మొదటి సారి ఓటర్ లిస్ట్ రివిజన్ జరుగడం లేదని కాంగ్రెస్ హాయంలో ఎన్నో సార్లు జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణాలో జరిగే రివిజన్ లో రోహింగ్యాలు, బంగ్లదేశీయులు ఉంటే వారి ఓటు ఖచ్చితంగా తొలగించాల్సిందేనని కిషన్ రెడ్డి అన్నారు. బెంగాల్ లో ఓట్లు తొలగిస్తే.. బంగ్లాదేశీయులకు బాధ ఎందుకు? అక్రమ బంగ్లాదేశీయుల ఓట్లు తొలగిస్తే.. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమిటన్నారు.ఈసీ ప్రక్రియను అడ్డుకుని భయ భ్రాంతులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వాళ్లు గెలిస్తే.. ఈవీఎంలు మంచివి. మిగతా రు గెలిస్తేనే ఈవీఎంలు మంచివి కావా? దిగజారి మాటలు ఎవరు మాట్లాడినా.. నేను స్పందించాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాకు నమ్మకం ఉంది. మీరు ఎస్ఐఆర్ లో ఈసీకి సహకరించి నకిలీ ఓట్లను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. పెట్రోల్, డీజిల్ పై కూడా సీఎం రేవంత్ మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశం కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో అత్యధికంగా వ్యాట్ ఉంది. కేంద్రాన్ని విమర్శించే తెలంగాణ సర్కారు.. వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో డిక్లరేషన్లు ఇచ్చి వాటిని అమలు చేయడం విస్మరించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోందన్నారు. క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు మంత్రులు చెప్పినట్లు జరుగడం లేదన్నారు.








Leave a Reply