NewsInn

News in a Click

మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ-రాజకీయ దుమారం

మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ-రాజకీయ దుమారం

(హైదరాబాద్, న్యూస్ఇన్)

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమెపై నమోదైన కేసు పెండింగ్లో ఉండడం…. నామినేషన్ పత్రాల్లో ఈ కేజీ కు సంబంధించిన వివరాలను మీనాక్షి నటరాజ్యం వెల్లడించకపోవడంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసినా…. తెలంగాణతో ముడిపడి ఉన్న అంశంలో ఆమెకు రాజకీయంగా భారీ షాక్ తగిలింది.ఈ వ్యవహారం తెలంగాణకు చెందిన ఒక కోర్టు కేసుతో ముడిపడి ఉండడం విశేషం.నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై ఓ మహిళ లైంగిక వేధింపులు, ప్రాణహాని బెదిరింపుల ఆరోపణలతో పోలీసు కేసులు నమోదయ్యాయి.

ఆయనపై పార్టీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ తార్నాకకు చెందిన ఎ. శ్రీలత 2025 ఆగస్టు 28న హైదరాబాద్ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌లో మీనాక్షీ నటరాజన్, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరారు.బాధితురాలు తన ఫిర్యాదులను కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.మీనాక్షీ నటరాజన్ శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పినా, దానికి సంబంధించిన దృవపత్రం ఇవ్వలేదని ఆరోపించారు. శివకుమార్ రెడ్డిపై కేసు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.బాధితురాలు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు మీనాక్షీ నటరాజన్ సహా ఫిర్యాదులో పేర్కొన్న వారందరికీ సమన్లు జారీ చేసింది.వీటిపై పలువురు నేతలు కౌంటర్ లు కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఈ పెండింగ్ న్యాయ వ్యవహారాన్ని వెల్లడించలేదనే కారణంతో ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

మీనాక్షి ఇష్యూ పై రంగంలోకి…

తెలంగాణ అడ్వకేట్ జనరల్ తో ఏఐసీసీ మంతనాలు మొదలుపెట్టింది.మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ పై న్యాయ పరంగా ముందుకు వెళ్లే అంశం పై మంతనాలు జరుపుతోంది.
మీనాక్షీ పై తెలంగాణ లో నమోదు అయిన కేసు ఆధారంగా మీనాక్షి నటరాజన్ రాజ్య సభ నామినేషన్ తిరస్కరణ కావడం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *