(హైదరాబాద్, న్యూస్ఇన్)
ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కొంత మంది రాక్షసులు ప్రకటనలు చేస్తున్నారని, రేపటి భవిష్యత్తుకు పునాదులు వేసే అద్బుతమైన నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం ఇస్తున్న రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈ ప్రాంతం ఉందన్నారు. బంగారం కంటే ఈ ప్రాంత భూములకు అధిక విలువ ఉందని సీఎం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకుల ముందు చూపుతో సైబరాబాద్ నిర్మాణం చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు మరో నగరాన్ని ప్రపంచానికి అందించారన్నారు. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, జీనోమ్ వ్యాలీ లాంటివి ఏర్పాటు చేస్తున్న సమయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అయిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

ఎన్నో కుట్రలు నాటి నుంచి చిమ్ముతూనే ఉన్నారని, మూసీ కంటే ప్రమాదకరమైన విషాన్ని చిమ్మారని విపక్ష పార్టీలపై ఆరోపణలు చేశారు. దేశంలోని ఢిల్లీ, ముంబాయి, కొల్ కత్త, చెన్నై, బెంగుళూ వంటి నగరాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం ప్రస్తావించారు. ఆ పరిస్థితి ఎదుర్కోకుండా ముందు జాగ్రత్తగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలని సర్కార్ నిర్ణయించింద్నారు. నగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్లోని నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేస్తున్నామన్నారు. కాలుష్య రహిత నగరంగా ఈ ప్రాంతాన్ని నిర్మాణం చేస్తామని సీఎం చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు కనీసం వారానికి ఒకసారి ఈ కార్యాయానికి వచ్చి పరిస్థితులు పర్యవేక్షిస్తారని, సమయం చిక్కిన్పుడు తాను కూడా ఇక్కడికి వస్తానని సీఎం ప్రకటించారు. ఫ్యూచర్ సిటీలో పలు గ్రామాలను విలీనం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వేదికపైనే నిర్ణయాన్ని వెల్లడించారు.











Leave a Reply