స్పెషల్ స్టోరీ
(హైదరాబాద్, న్యూస్ఇన్)
నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వేగంగా అడుగులు వస్తుంది. వచ్చే మార్చి నెలలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంగా ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తూ తీసుకోవలసిన చర్యలపై దృష్టి సాధించారు…ప్రైవేట్ యాజమాన్యం చేతిలో ఉన్న మెట్రో ప్రభుత్వం చేతికి వస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చన్న చర్చ మొదలైంది. ఇప్పుడున్న సమస్యలు పరిష్కారం అవుతాయా ?.ప్రభుత్వాన్ని వెంటాడే సమస్యలు మెట్రో ప్రాజెక్టులో చుట్టు ముడుతాయా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎందుకు టెక్ ఓవర్ చేస్తోందన్నది అందరిలోనూ మెదలుతున్న ప్రశ్న. వ్యాపార దృక్పథంతో నిర్వహించే ప్రైవేటు సంస్థలు తమకు నష్టం వస్తే చేతులు తలుపుకోవడం సహజం…. ఇక్కడ పెరుగుతున్న నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రైవేట్ సంస్థ ముందుకు వచ్చింది. కానీ ఆ సంస్థ అనుకున్న లక్ష్యాలకు దూరంగానే ఉంటుంది. పరిస్థితులు కలిసి రాకపోవడం…. అంచనాలకు దగ్గరగా చేరకపోవడం వంటి అంశాలు ప్రైవేటు యాజమాన్యాన్ని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ మా వల్ల కాదన్న ప్రకటనతో ప్రభుత్వం ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెట్రో కు లాభాల్లోకి తెచ్చే ప్రయత్నాలకు సహకరించింది… కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో… ప్రభుత్వమే మెట్రోను నిర్వహించేందుకు రెడీ అవుతోంది.

నిర్వహణ మెరుగు పడుతుందా
అంటే దీనిపై ధన్యవాదములు వినిపిస్తాయి… కచ్చితంగా మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం తీసుకుంటే… నిర్వహణ బాధ్యతలను పగడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. నిర్వహణలో ఏమాత్రం అలసత్వం చూపినా మెట్రో రైల్వే ఆహారం కూడా సిటీ బస్సులకు ఎక్కువ…… ఎక్స్ప్రెస్ రైళ్లకు తక్కువ అన్న చందంగా మరే అవకాశాలు ఉంటాయి. నగరంలో సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లేందుకు మెట్రోని ఎక్కువమంది ఆశ్రయిస్తున్నారు…. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత నిర్వహణ లోపాలు ఉంటే మెట్రో ప్రయాణికుల పరిస్థితి అయోమయంగా మారుతుంది. దీనికి తోడు ప్రభుత్వ స్వాధీనంలోకి మెట్రో వస్తే… రాజకీయంగా జోక్యం పెరిగే అవకాశం కూడా ఉంది. తద్వారా నాణ్యత ప్రమాణాలు ప్రైవేట్ తో పోటీపడే స్థాయిలో ఉండవన్న జరుగుతుంది. ప్రభుత్వ సంస్థలు గా చలామణి అవుతున్న ఆర్టీసీ, రైల్వేలని ఎందుకు ఉదాహరణలుగా కొంతమంది చెబుతున్నారు.
అదనపు భారం ఎవరిపై
ప్రస్తుతం మెట్రో నష్టాల్లో నడుస్తోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. దీనికి తోడు మెరుగైన సౌకర్యాలు టికెట్ ధరలు పెంచుకోవచ్చు. లేదంటే సబ్సిడీ రూపంలో మెట్రోకు నిద్రకేటాయించడం వంటి చర్యలను ప్రభుత్వం వెంటనే అమలు చేసే అవకాశం ఉంది.
ప్రజలకు జరిగే లాభం ?
- టికెట్ ధరల నియంత్రణ
ప్రైవేట్ సంస్థకు లాభం ముఖ్యం. ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనం ముఖ్యం.అందువల్ల ధరల పెంపును కొంతవరకు నియంత్రించవచ్చు.
- రూట్ విస్తరణలో వేగం
లాభం లేని ప్రాంతాలకు ప్రైవేట్ సంస్థ వెళ్లదు. ప్రభుత్వం వెళ్లగలదు.
పాతబస్తీ, శివారు ప్రాంతాలు లాభపడే అవకాశం ఉంది.
- సామాజిక బాధ్యత
విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం ప్రభుత్వానికి సులభం.
- నగర ప్రణాళికతో అనుసంధానం
బస్సులు, మెట్రో, సబర్బన్ రైలు—అన్నీ ఒకే ప్రణాళికలో నడిచే అవకాశం.
ఇవి ప్రభుత్వం అమలు చేయగలిగితే ప్రజలకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది

నష్టాలు…….
ప్రతి నిర్ణయం రాజకీయ లెక్కలతో తీసుకుంటే మెట్రో నాణ్యత పడిపోతుంది.ప్రైవేట్ రంగంలో పనిచేసే వేగం, బాధ్యత భావం ప్రభుత్వంలో సాధారణంగా కనిపించదు.ఇతర రంగాలైన ఆరోగ్యం, విద్య, గ్రామీణ అభివృద్ధి నిధులు మెట్రో నష్టాలకు మళ్లే ప్రమాదం.
సమస్య ఎక్కడ ?
సమస్య ప్రైవేట్ vs ప్రభుత్వం కాదు
ప్రపంచవ్యాప్తంగా మెట్రో నిర్వహణ తీరును పరిశపరిశీలిస్తే కొన్ని ప్రభుత్వ ఆధీనంలో విజయవంతంగా నడుస్తున్నాయి.ప్రైవేట్ ఆధీనంలో కూడా పలు చోట్ల సక్సెస్ ఫుల్ గా ఉన్నాయి.
మెట్రో విజయవంతం కావాలంటే నిపుణుల సూచనలు
- పూర్తి ప్రభుత్వ స్వాధీనం కాకుండా హైబ్రిడ్ మోడల్
ప్రభుత్వం నియంత్రణ
ప్రొఫెషనల్ మేనేజ్మెంట్
- స్వతంత్ర రెగ్యులేటరీ బోర్డ్
టికెట్ ధరలు
సేవల నాణ్యత
ఖర్చుల పర్యవేక్షణ
- పాలిటికల్ జోక్యం
మెట్రోను రాజకీయ వేదికగా మార్చకూడదు
- ప్రజలకు స్పష్టత
నష్టాలు,లాభాలు,ఖర్చులు
అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉండాలి.
హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం కావడం అన్నింటికి పరిష్కారంకాదు.ఎలా అమలు చేస్తారన్నదే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు.సమర్థవంతమైన నిర్వహణ ఉంటే ప్రజలకు లాభం జరుగుతుంది.రాజకీయాలు, నిర్లక్ష్యం పెరిగితే నష్టం. ప్రభుత్వం తీసుకుంటే ఎలా నడుపుతుందన్నది ఇదే అసలు ప్రశ్న.





Leave a Reply