కేంద్ర మంత్రి బండి సంజయ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసు నమోదు చేసిన నాటి నుంచి ఎన్నో టీవీ సీరియళ్ల పూర్తయినా….ట్యాపింగ్ కేసు ముందుకు సాగడం లేదని సంజయ్ వాపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావ్ లతో పాటు తనకు నోటీసులు ఇచ్చినా స్వాగతిస్తానని సంజయ్ వ్యాఖ్యానించారు.నాతోపాటు అగ్ర నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఎన్నో కుటుంబాల్లో తండ్రికొడుకులు చిచ్చు పెట్టారని ఆరోపించారు. ఆఖరుకు కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసే స్థాయికి వారు దిగజారి వ్యవహరించారన్నారు.ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలున్నాయన్నారు.కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటారా?… పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చడంపై అనుమానాలుఏ వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ లా సాగదీస్తున్నారే తప్ప చర్యలు లేవన్నారు.విచారణ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చ విచారణ జరిగేలా ప్రభుత్వం చూడాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.







Leave a Reply