NewsInn

News in a Click

23 నుంచి హైద‌రాబాద్ లో ఆల్ ఇండియా పోలీస్ క్రీడ‌లు

23 నుంచి హైద‌రాబాద్ లో ఆల్ ఇండియా పోలీస్ క్రీడ‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఈ నెల 23వ తేదీ నుంచి న‌గ‌రంలోని గ‌చ్చిబౌలి స్టేడియంలో ఆల్ ఇండియా పోలీస్ క్రీడ‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పోలీసు శాఖ‌లో విధులు నిర్వ‌హిస్తున్న వారు పాల్గొన‌నున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సీఐఎస్ ఎఫ్ పూర్తి చేసింది.ఈ ఛాంపియన్‌షిప్‌లో 36 రాష్ట్ర పోలీస్, కేంద్ర సాయుధ భద్రతా దళాల (సీఏపీఎఫ్) సంస్థలకు చెందిన 1,600 మందికి పైగా క్రీడాకారులు హాజ‌రు కానున్నారు. జూడో, వుషు, టేక్వాండో, కరాటే, పెంచాక్ సిలాట్ క్రీడాంశాలలో పోటీలు జ‌రుగ‌నున్నాయి. జాతీయ సమాఖ్యలకు చెందిన దాదాపు 150 మంది సాంకేతిక అధికారులు ఈ పోటీలను పర్యవేక్షించనున్నారు. ఈ పోటీల గురించి ఎన్ఐఎస్ఏ డైరెక్టర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్‌ప్రీత్ కౌర్ సోహి మాట్లాడుతూ.. ఈ ఛాంపియన్‌షిప్ పోలీస్, సీఏపీఎఫ్ సిబ్బందిలో క్రీడా సంస్కృతిని పెంపొందించడంతో పాటు అథ్లెట్లు తమ ప్రతిభను, క్రీడా నైపుణ్యాన్ని చాటుకోవడానికి ఒక వేదిక‌గా నిలుస్తుంద‌న్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన ఒలింపియన్ పారుపల్లి కశ్యప్, ప్రముఖ రోయింగ్ కోచ్ శ్రీ ఇస్మాయిల్ బైగ్ మాట్లాడుతూ.. యూనిఫాం ధరించే దళాలలో క్రమశిక్షణ, స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో క్రీడలు ఉపయోగపడతాయన్నారు. 2026 లో ఆసియా క్రీడాలు ఉన్న నేప‌థ్యంలో ఈ పోటీలు క్రీడాకారుల‌కు ఎంతో ఉప‌యోగ‌కరంగా మార‌నున్నాయి. తెలంగాణ రాష్ట్ర జంతువైన మచ్చల జింక ఆధారంగా రూపొందించిన ఈ ఛాంపియన్‌షిప్ మస్కట్ ‘వీరా’ను ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *