సీఎం రేవంత్ రెడ్డి
(న్యూస్ఇన్,హైదరాబాద్)
తెలంగాణ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. శాసనసభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అదే సమయంలో SIR పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని, ప్రతి ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గాల్లో ఓటర్ల ఓట్లు కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

వెయ్యి రోజుల పాలన సందర్భంగా నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు శాసనసభ సమావేశాలను వాడుకోవాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. మూడు రోజుల పాటు సభ సజావుగా సాగకుండా వ్యవహరించారని, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధుల పట్ల బీఆర్ ఎస్ నేతలు అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు.
స్పీకర్ ను దూషించారని, దళితుల నిరసన కార్యక్రమం అనంతరం వారు నడిచిన ప్రదేశాన్ని శుద్ధి చేయడం ద్వారా బీఆర్ ఎస్ దళితులను అవమానించిందని సీఎం పేర్కొన్నారు. ఈ ఘటనలపై పూర్తి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
జనగణనలో కులగణనను చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం అన్నారు. దేశంలో వయోజనుల జనాభా, ఓటర్ల జాబితా మధ్య వ్యత్యాసం ఉందనన్నారు. ప్రతి ఎమ్మెల్యే వ్యక్తిగత పనితీరు భవిష్యత్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.













Leave a Reply