NewsInn

News in a Click

కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీ నిర‌స‌న‌ – అరెస్టులు

కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీ నిర‌స‌న‌ – అరెస్టులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

హైద‌రాబాద్ లో రాజ‌కీయంగా వేడి ర‌గిలింది. జాతీయ పార్టీలు పోటా పోటీగా ర్యాలీ నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ రాహూల్, ప్రియాంక గాంధీల అరెస్టును నిర‌సిస్తూ ఛ‌లో లోక్ భ‌వ‌న్ కు పిలుపునిచ్చింది. పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ స‌హా ప‌లువురు నేత‌లు లోక్ భ‌వ‌న్ కు వెళుతుండ‌గా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాని మోడీపై అవ‌మానించేలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం గాంధీ భ‌వ‌న్ ను ముట్ట‌డిం చే య‌త్నం చేసింది. పోలీసులు అప్ర‌మ‌త్త‌మై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రాంచంద‌ర్ రావ్ స‌హా ప‌లువురు బీజేపీ నేత‌ల‌ను అరెస్టు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా బీజేపీ కార్యాల‌యం ముట్ట‌డికి రావ‌డంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొంది. ఈ రెండు పార్టీ ల కార్యాల‌యాలు అతి స‌మీపంలో ఉండ‌డంతో ఇరు పార్టీల కార్య‌క‌ర్త‌లు కూడా నువ్వా నేనా అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. నాంప‌ల్లిలో రెండు పార్టీల కార్యాల‌యాలు ఉండ‌డంతో ప్ర‌ధాని ర‌హ‌దారిపై కూడా ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఎర్ప‌డ్డాయి. ఇరు పార్టీల నేత‌లు రోడ్ల‌పైకి రావ‌డంతో…. ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్తాయి.ఈ స‌మ‌యంలో కొంత మది రాళ్లు రువ్వ‌డంతో మీడియా ప్ర‌తినిధుల‌కు గాయ‌ల‌య్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *