NewsInn

News in a Click

ప‌రారీలో ట్రైనీ ఐపీఎస్ ఉద‌య్ క్రిష్ణారెడ్డి…?

ప‌రారీలో ట్రైనీ ఐపీఎస్  ఉద‌య్ క్రిష్ణారెడ్డి…?

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

ట్రైనీ ఐపీఎస్ అదికారి ఉద‌య్ క్రిష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. ఆయ‌న ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.జాతీయ స్థాయిలో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసిన ట్రైనీ ఐపీఎస్ అధికారుల వ్య‌వ‌హారం మ‌రింత ఆస‌క్తి రేపుతోంది.మ‌హిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి మ‌రో అధికారి అయిన ఉద‌య్ క్రిష్ణా రెడ్డి త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేశార‌ని ఫిర్యాదు చేయ‌డంతో సంచ‌ల‌నంగా మారింది. ఆ త‌రువాత ఎన్నో ట్విస్ట్ లు ఈ కేసులో వెలుగు చూశాయి. ఉద‌య్ క్రిష్ణారెడ్డి ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసుకున్నార‌ని లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కాని ఆసుప‌త్రిలో చికిత్స అందించిన వైద్యులు ఆత్మ‌హ‌త్యా య‌త్నం కాద‌ని అతిగా మ‌ధ్యం సేవించ‌డ‌మే ఆయ‌న స్పృహ కోల్పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తేల్చారు. పోలీసులు కూడా ఉద‌య్ క్రిష్ణా రెడ్డి పెద్ద డ్రామా సృష్టించారన్న అభిప్రాయానికి వ‌చ్చారు.

ఆ త‌రువాత ఈ కేసును విచారించేందుకు మ‌హిళా అధికారి లావ‌ణ్య‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మ‌హిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి స‌హా ప‌లువురిని ఆమె విచారించారు. ఇక ఉద‌య్ క్రిష్ణా రెడ్డిని విచారించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న అధికారుల‌కు ఆయ‌న ఆచూకీ దొర‌క‌డం లేదు. రెండు,మూడు రోజులుగా నోటీసులు ఇచ్చి విచార‌ణ చేయాల‌ని భావిస్తున్నా..ఆయ‌న ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఉద‌య్ క్రిష్ణారెడ్డిని ఆచూకీ కోసం పోలీసులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లితం ద‌క్క‌డం లేదు. దీంతో పోలీసులు ఈ కేసులో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఉన్న‌తాధికారుల కేసు, జాతీయ స్థాయిలో ప్రాధాన్య‌త ఉన్న కేసు కావ‌డంతో పోలీసులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *