(హైదరాబాద్,న్యూస్ఇన్)
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ క్రిష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు బయట పడుతున్నాయి. ఇది ఆత్మహత్యా యత్నం కాదని, సింపథీ కోసం ఆడిన డ్రామా అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ కు తనకు ఎన్నో రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఓ లేఖ పోలీసులకు లభ్యమైంది. రెండు రోజులుగా ఈ కేసులో గం గంటకు కొత్త ట్విస్ట్ లు తెరపైకి వస్తున్నాయి.
మహిళా ట్రేనీ ఐపీఎస్ అధికారిని వేదింపులకు గురి చేయడంతో ఆ మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు కూడా నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతుడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. కేసు నమోదైన గంటల వ్యవధిలోనే ఉదయ్ క్రిష్ణారెడ్డి ఆత్మహత్యా యత్నం చేశారంటూ జోరుగా ప్రచారం మొదలైంది. ట్రైనీ మహిళతో తాను ఎన్నో రోజులుగా సన్నిహితంగా ఉన్నట్లు ఉదయ్ క్రిష్ణారెడ్డి ఫోన్ లో స్టేటస్ కూడా పెట్టుకున్నారు. పోలీసు కేసు నమోదైన మరుసటి రోజు ఉదయం వేళల్లోనే ఆపస్మారక స్థితిలో ఉన్న ఉదయ్ క్రిష్ణారెడ్డికి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే పరిశీలించిన వైద్యులు ఉదయ్ శరీరంలో ఎలాంటి విష పదార్థాలు లేవని పరీక్షలతో తేల్చారు. నాన్ స్టాప్ గా మధ్యం సేవించడమే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లేందుకు కారణమైందని నిర్ధారించారు. ప్రాణాపాయం లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఆల్కాహాల్ పరిమితికి మించి తీసుకోవడంతోనే ఈ పరిస్థితి ఎదరైందని వైద్యులు నిర్ణయానికి వచ్చారు. మరో వైపు పోలీసులు కూడా ఆయనపై నమోదు చేసిన కేసులో విచారణ మొదలు పెట్టారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఉదయ్ క్రిష్ణారెడ్డి ఆత్మహత్యా యత్నం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని మహిళ ఫిర్యాదుతో పరువు పోయిందని భావించి ఆయన ఓ కట్టుకథను నడిపించారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక సూసైడ్ నోట్ పై కూడా మరింత లోతుగా విచారణ జరుపాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో రెండు రోజుల్లోనే ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల విచారణ పూర్తయితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఉదయ్ డ్రామా అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడంతో…..ఇది కూడా మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
అయితే ఉదయ్ క్రిష్ణా రెడ్డి సూసైడ్ నోట్ వెలుగు చూడడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఆ మహిళా ట్రైనీ తనను రెచ్చగొట్టిందని, వాట్సప్ చాటింగ్ చేసి తన రూంలోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించిందని రాశారు. ఆధారాల కోసం ఆ వీడియోలు తన దగ్గర ఉన్నాయని, ట్రైనీ ఐపీఎస్ భర్తకు కూడా జరుగుతున్న విషయాన్ని తాను తెలియచేసినట్లు లేఖలో రాశారు. మహళా ట్రైనీ ఐపీఎస్ తో పాటు మరికొందరి పాత్ర కూడా ఇందులో ఉందని అందరిపై చర్యలు తీసుకోవాలన్న లెటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Leave a Reply