(హైదరాబాద్,న్యూస్ఇన్)
వర్షాకాలం మొదలైన నాటి నుంచి అంతంత మాత్రంగానే ఉన్న వర్షాలు గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. కీలక సమయంలో మొహం చాటేసిన వర్షాలు ఇప్పుడు భారీగా కురుస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్ష పాతం నమోదైంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో పెద్ద ఎత్తున రహదారులు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా భూపాలపల్లి జిల్లా పలిమెల లో గడిచిన 24 గంటల్లో 19.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో ఈ సీజన్ లో అత్యధికంగా ముషీరాబాద్ లో 5.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. బుధ, గురు వారాల్లో కూడా ఉత్తర తెలంగాణాతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.అల్పపీడన ప్రభావం కారణంగా పలు చోట్ల 45 సెం.మీ వరకు వర్షం కురిసే చాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చిరుజల్లులతో పాటు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Leave a Reply