(హైదరాబాద్,న్యూస్ఇన్)
తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని చెప్పి అమాయక ప్రజలకు టోకరా వేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కోట్ల రూపాయల సొమ్మును కాజేసిన అంతర్రాష్ట్ర నేరస్థుడు, వ్యవస్థీకృత నేర ముఠా సభ్యుడైన కొండాపురం లక్ష్మీకాంత్ రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈ కేసు వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి… సనత్ నగర్కు చెందిన రాకేష్ బలరాం గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసు స్టేషన్లో కేసు చేశారు.నిందితుడు తనకు విదేశీ బంగారం వ్యాపారులతో పరిచయాలు ఉన్నాయని, దుబాయ్ మరియు శ్రీలంకల నుండి ముంబై మార్గం ద్వారా అతి తక్కువ ధరకే విదేశీ బంగారం తెప్పించి ఇస్తానని బాధితులను నమ్మించేవాడు. దీని కోసం రవాణాకు సిద్ధంగా ఉన్న బంగారు బిస్కెట్ల వీడియోలను వాట్సాప్ ద్వారా పంపి బాధితులకు నమ్మకం కలిగించేవాడు. అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపి బాధితుడి వద్ద నుండి సుమారు రూ. 2 కోట్ల రూపాయలు రాబట్టుకున్నాడు ఇదే పద్ధతిలో మరికొంత మంది తో కూడా భారీగా నగదు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో పలు నేరాలు చేసిన కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని ఆయన స్వగ్రామంలో మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం అయ్యవారి పల్లిలో అదుపులోకి తీసుకుని పోలీసులు కోర్టులు హాజరు పరిచారు.
పోలీసుల హెచ్చరిక……
తెలిసిన వారు లేదా తెలియని వ్యక్తులు తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని ఆశ చూపితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు సూచించారు. అపరిచితులకు, మోసగాళ్లకు ఇచ్చి మోసపోకూడదని సిసిఎస్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.












Leave a Reply