NewsInn

News in a Click

పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేయాలి – బీఆర్ఎస్

పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేయాలి – బీఆర్ఎస్

(హైదరాబాద్, న్యూస్ఇన్)

రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.22 ఏ జాబితా భూములను చేర్చి కొత్త వివాదానికి ప్రభుత్వం తెరలైపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు శిక్ష భరించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో 22ఏ బాధితుల సమావేశానికి హరీష్ రావు హాజరై ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు.2008లో ULC రద్దయిన తర్వాత, మళ్లీ ఇప్పుడు ఈ భూములను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు.ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 7,500 జీవోలతో, మేడ్చల్ జిల్లాలో 6,000 జీవోలతో లక్షలాది ఆస్తులను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చాలని చెప్పారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తన చేతిలోకి రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికారులను ఆదేశించి రాత్రికి రాత్రే ఈ ఆస్తులను బ్లాక్ చేయించారని ఆరోపించారు.


ఈ నిర్ణయంతో లక్షలాది అపార్ట్మెంట్లు, ఇళ్లు, ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తుందన్నారు.
దొంగతనం చేసిన దొంగ దొరికిపోయాక.. సారీ చెబితే చేసిన నేరం మాఫీ అయిపోతుందా? అని ప్రశ్నించారు.ఈ జాబితా నుంచి ఆస్తులను తొలగించాలంటే 30 శాతం కమీషన్ అడుగుతున్నారట.. ఇది ముమ్మాటికీ 30 పర్సెంట్ కమీషన్ ప్రభుత్వమే. 22A నుంచి తీయాలంటే, ల్యాండ్ డెవలప్మెంట్ కూడా తమకే అప్పజెప్పాలని బ్లాక్ మెయిల్ చేస్తూ కండిషన్లు పెడుతున్నారని బాధితులు తమకు తెలిపారన్నారు.
అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటామంటే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబితేనే అధికారులు భూములను నిషేధిత జాబితాలో పెట్టారు తప్ప వాళ్లంతట వాళ్లు చేయలేదన్నారు. వివాదానికి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *