NewsInn

News in a Click

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ- సీఎం తీవ్ర విమర్శలు

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ- సీఎం తీవ్ర విమర్శలు

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌కుండా కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది త‌న‌కు జ‌రిగిన అవ‌మానం కాద‌ని తెలంగాణా ప్ర‌జ‌ల‌ను అవ‌మాన‌ప‌రిచింద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంగ్లాండ్, ఆమెరికా ప‌ర్య‌ట‌న‌ల‌కు తాను అనుమ‌తి కోరామ‌ని ఇంగ్లాండ్ ప‌ర్య‌న‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు కేంద్రం కుట్ర‌తో అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని సీఎం ఆరోపించారు. ఆమెరికా ప‌ర్య‌ట‌నకు అనుమ‌తి రాక‌పోవ‌డంతో ఇంగ్లాండ్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న సీఎం ఈ రోజు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వెల్ల‌డించారు.

విజ‌న్ 2047లో భాగంగా ఆమెరికాలో ప‌లు సంస్థ‌లతో ఒప్పందాలు చేసుకునేందుకు, పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు రోడ్ షోలు నిర్వ‌హించేందుకు అమెరికాలో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకుని కేంద్ర ప్ర‌భుత్వానికి పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించామ‌న్నారు. అయితే పోలిటిక‌ల్ కార‌ణాల చూపుతూ కేంద్రం యూఎస్ ప‌ర్యట‌నకు అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని తెలియ‌చేసింద‌న్నారు. సీఎం విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చాటు మాటుగా జ‌రుగ‌వ‌ని, భార‌త ప్ర‌భుత్వ రాయ‌భార కార్యాల‌యం పూర్తి స్థాయిలో త‌మ ప‌ర్య‌ట‌నను ప‌రిశీలిస్తోంద‌ని, కేంద్ర ప్ర‌భుత్వానికి నివేదిక ఇస్తుంద‌న్నారు.

ప్ర‌ధాని చంద్ర‌మండ‌లానికి వెళ్లేలా ఉన్నారు…..

ఫెడ‌ర‌ల్ స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని సీఎం ఆరోపించారు. ప్ర‌ధాని మోడీ అన్ని దేశాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేయ‌వ‌చ్చు గాని పెట్టుబ‌డుల కోసం తెలంగాణా సీఎం అమెరికాకు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం కుట్ర అని ఆరోపించారు. అవ‌కాశం వ‌స్తే మోడీ చంద్ర‌మండ‌లం కూడా వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తార‌ని సీఎం అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు ఈ నెలలోనే యుఎస్ కెనడాలో ఎనిమిది రోజుల విదేశీ పర్యటనకు వెళ్ళారు. దేని కోసము? వైబ్రెంట్ గుజరాత్ 2047 అనే పాలసీ డాక్యుమెంట్ ను ప్రమోట్ చేయడానికి రోడ్ షోలు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రిని మీరు అనుమతించారు. అదే తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా ఎడ్యుకేషన్,స్పోర్ట్, పెట్టుబ‌డుల‌కు మాత్రం అనుమ‌తి ఇవ్వ‌ర‌న్నారు.

కిష‌న్ రెడ్డి సీఎం అవుతారా…..

త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌ను త‌ప్పుదేవ పట్టించే విధంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు చేయ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.త‌న‌ను విమ‌ర్శించే స్థాయి కిష‌న్ రెడ్డికి లేద‌ని….భ‌విష్య‌త్తులో కూడా రాద‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌నించారు. ముఖ్యమంత్రిగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ స్థాయి లేదన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో ఎండ‌గ‌డుతామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *