ఎర్రవల్లిలో ఉదయం నుంచే హైటెన్షన్..!!
(న్యూస్ఇన్,హైదరాబాద్)
మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కాంగ్రెస్ పార్టీ ముట్టడించే యత్నం చేయడంతో ఎర్రవల్లి లో హై టెన్షన్ ఏర్పడింది.
మంగళవారం ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెయ్యి డప్పులతో ఎర్రవల్లి ఫామ్హౌస్ ముట్టడి చేపట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ఫాం హౌస్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినా….కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో బీఆర్ ఎస్ కార్యకర్తలు కూడా అప్రమత్తమై పెద్ద ఎత్తున ఫాం హౌస్ పరిసర ప్రాంతంలోకి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణ కల్పించింది. అధికార పార్టీకి చెందిన పలువురు దళిత శాసనసభ్యులు కూడా తమ అనుచరులతో కలిసి వెళేయత్నం చేయడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు పెంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ , హరీష్ రావు లు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయలు దేరారు.
దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఇద్దరిని అరెస్టు చేసి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడకు బీఆర్ ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు….కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి రావడంతో పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.స్పీకర్ వ్యవహారంతో ప్రారంభమైన వివాదం ఇప్పుడు కేసీఆర్ ఫామ్హౌస్ వరకు చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సారిగా వేడి రగిలింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న పరిణామాలతో ఒక్క సారిగా హట్ హాట్ గా మారింది.


కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీఆర్ ఎస్….బీఆర్ ఎస్ వైఖరిని పై కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీలకు చెందిన నేతలు కూడా క్షేత్ర స్థాయిలో ఆందోళనలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు ప్రజాక్షేత్రంలో నువ్వా నేనా అన్నట్లు వ్యవహరించాయి.
మరో వైపు శాసనసభ సమీపంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత దూమారం రేపాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అధికార పార్టీపై బీఆర్ ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సూచనల మేరకే స్పీకర్ ను దూషించారని విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు కౌంటర్ గా బీఆర్ ఎస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగానే ఎమ్మెల్యేలు కేసీఆర్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేశారన్న వాదనను తెరపైకి తెచ్చారు.













Leave a Reply