NewsInn

News in a Click

బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దళిత అస్త్రం……!

బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దళిత అస్త్రం……!
  • దళితుల‌కు ద‌గ్గ‌ర‌య్యే వ్యూహం..!

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా కొత్త కొత్త అంశాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. నేత‌ల చావుల‌తో పాటు సామాజిక వ‌ర్గాల కోణం కూడా ఈ స‌మావేశాల్లో కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది. శాస‌న‌స‌భా స‌మావేశాల మొద‌టి రోజు మొద‌లైన వివాదం కొన‌సాగుతూనే ఉంది. తొలి రోజు న‌ల్ల టీష‌ర్ట్ ల‌తో స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు బీఆర్ ఎస్ నేత‌లు న‌ల్ల టీ ష‌ర్ట్ లు ధ‌రించి రావ‌డం…పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంత వివాదం మొద‌లైంది. అసెంబ్లీ ముందు గేట్ దగ్గ‌ర పోలీసులు గులాబీ నేత‌ల‌ను అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. న‌ల్ల టీష‌ర్ట్ ల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు చెప్ప‌డంతో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు త‌మ టీ షర్ట్ ల‌ను విప్పి నిర‌స‌న తెలిపారు. ఆ త‌రువాత నేత‌ల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదంతో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్య‌లు అసెంబ్లీ స‌మావేశాలు హాట్ హాట్ గా మారేందుకు ప్ర‌ధాన కార‌ణంగా మారింది.

ఎమ్మెల్సీలు తాతా మ‌ధు, న‌వీన్ రెడ్డి స్పీక‌ర్ తల్లి గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని అస‌రాగా తీసుకుని గులాబీ పార్టీ పై అటాక్ మొద‌లు పెట్టింది. ద‌ళితులంటే బీఆర్ ఎస్ కు గౌర‌వం లేద‌ని ద‌ళిత స్పీక‌ర్ కావ‌డంతోనే పార్టీ అధినేత ఆదేశాల మేర‌కు ఎమ్మెల్సీలు వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోపించారు. స్పీక‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ నేత‌లు కూడా సీరియ‌స్ గా ప‌రిగ‌ణిస్తూ గులాబీ నేత‌ల తీరును ఎండ‌గ‌ట్టారు. ద‌ళిత నేత‌లు కేసీఆర్ ఫాం హౌస్ ద‌గ్గ‌ర చావు డ‌ప్పు కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌కు పిలుపు నివ్వ‌డంతో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ద‌ళిత ఎమ్మెల్యేలు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు బ‌య‌లు దేర‌డంతో వివాదం మ‌రింత ముదిరింది. కాంగ్రెస్ నేత‌ల ఆందోళ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అక్క‌డికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితిలు నెల‌కొన్నాయి.

తొలి రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌లో విధినిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల ఫిర్యాదుతో బీఆర్ ఎస్ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేశారు. ఈ స‌మ‌యంలో మ‌హిళా శాస‌న‌స‌భ్యుల‌పై పోలీసులు అనుస‌రించిన తీరుతో పాటు ఇత‌ర అంశాల‌పై ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును గులాబీ పార్టీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ కు క‌లిసి ఫిర్యాదు చేశారు. మ‌హిళా శాస‌న‌స‌భ్యుల‌తో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును గులాబీ పార్టీ త‌ప్పుబ‌డుతోంది.

ఇక వెంట‌నే తేరుకున్న కాంగ్రెస్ కూడా గ‌వ‌ర్న‌ర్ అపాయింట్ మెంట్ కోరి బీఆర్ ఎస్ పై ఫిర్యాదు చేసింది. ద‌ళితుల ఆత్మ‌గౌర‌వం దెబ్బ తినేలా బీఆర్ ఎస్ వ్య‌వ‌హ‌రిస్తోందని ద‌ళితుల ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడాల‌ని కోరింది. ప్ర‌జాస్వామ్యంలో కీల‌క స్థానంలో ఉన్న స్పీక‌ర్ గా ద‌ళిత నేత ఉండ‌డాన్ని బీఆర్ ఎస్ జీర్ణించుకోలేక‌పోతుంద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో పాటు చావు డ‌ప్పు పిలుపు అనంత‌రం కాంగ్రెస్ ద‌ళిత నేత‌లు తిరిగిన ర‌హ‌దారిని బీఆర్ ఎస్ ప‌సుపు నీళ్లు చ‌ల్లి శుద్ధి చేయ‌డం ద‌ళిత వ్య‌తిరేక చ‌ర్య‌లే అని ఆరోపించింది. ఈ ఘ‌ట‌న‌పై కూడా కేసీఆర్ పై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. ద‌ళిత స‌మాజాన్ని ఆగౌర‌వ ప‌ర‌చ‌డం బీఆర్ఎస్ కు కొత్త కాద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు.

దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని విస్మరించడం, దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యను అనూహ్యంగా పదవి నుంచి తొలగించడం, మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీని విస్మరించడం, దళిత బంధు పథకాన్ని ఎన్నికల స్టంట్‌గా మార్చడం వంటి అంశాల‌ను కాంగ్రెస్ ఫిర్యాదులో ప్ర‌స్తావించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *