(న్యూస్ఇన్,హైదరాబాద్)
తెలంగాణ నుంచి పారుతున్న క్రిష్ణ నది జలాలు ఏపీ కి తరలిపోతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. నీటి వనరులు అందుబాటులో ఉన్నా తెలంగాణా రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్రెడ్డి పాలన వైఫల్యంతో వచ్చిన కరువని విమర్శించారు.
పాలమూరు బిడ్డను అని చెప్పుకునే సీఎం కృష్ణా జలాలను ఎత్తిపోసి రైతులకు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని హరీశ్రావు ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు పంప్హౌస్లో ఐదు మోటార్లకు బదులుగా రెండు మాత్రమే నడుపుతున్నారని, అవి కూడా పరిమిత సమయమే పనిచేస్తున్నాయన్నారు.
బీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ తదితర ప్రాజెక్టుల మోటార్లను పూర్తి స్థాయిలో నడిపి రైతులకు నీరందించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం నుంచి ఏపీ 35 టీఎంసీల నీటిని వినియోగించుకోగా తెలంగాణ కేవలం 7 టీఎంసీలు మాత్రమే వాడుకుందన్నారు.

తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీ తరలించకుండా అడ్డుకోవాలని, అవసరమైతే అపెక్స్ కౌన్సిల్ను ప్రభుత్వం ఆశ్రయించాలని కోరారు. రాజకీయ విమర్శలు, పవర్పాయింట్ ప్రజెంటేషన్లు కాకుండా రైతులకు విద్యుత్, పొలాలకు సాగునీరు అందివ్వాలని సూచించారు.
నిజామాబాద్ రైతుల సమస్యలపైనా వేముల ప్రశాంత్రెడ్డి స్పందిస్తూ.. ఎస్సారెస్పీలో నీరు ఉన్నప్పటికీ గుత్ప, అలీసాగర్ లిఫ్టులను పూర్తి స్థాయిలో నడపడం లేదని ఆరోపించారు. అన్ని మోటార్లను నడిపి చెరువులు నింపాలని డిమాండ్ చేశారు.













Leave a Reply