(హైదరాబాద్,న్యూస్ ఇన్)
కొత్తగా శాసనసభ ఏర్పడిన తరువాత శాసనసభ, శాసనమండలిలో కీలక పోసులను పార్టీ అధినేత కేసిఆర్ నేతలను నియమించారు. సామాజిక సమీకరణలు, సీనియార్టీ ఆధారంగా ఈ నియామాకలు జరిగాయని చెప్పుకోవచ్చు. శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా కీలక నేతలు హరీష్ రావ్, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు అవకాశం కల్పించారు.



శాసన మండలిలో పార్టీ శాసనమండలిపక్ష నేతగా మధుసూధనాచారి కొనసాగుతుండగా ఉప నేతలుగా ఎల్. రమణ, శ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లను నియమిస్తూ….. పార్టీ విప్ దేశపతి శ్రీనివాస్ ను నియమించారు. ఈ విడత అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉండడంతో శాసనసభ, శాసనమండలిలో పార్టీ నేతలకు పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.



ఉభయ సభల్లోను ఆధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించాలని అధినేత కేసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.



Leave a Reply