NewsInn

News in a Click

మూడేళ్లల్లో ఏపీ విద్యా విధానానికి దేశంలోనే గుర్తింపు దక్కాలి

మూడేళ్లల్లో ఏపీ విద్యా విధానానికి దేశంలోనే గుర్తింపు దక్కాలి

పిల్లల్లో నైపుణ్యాలను గుర్తించాలి

                      (అమ‌రావ‌తి, న్యూస్ఇన్‌)
విద్యార్థుల ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికోసం ‘కలలకు రెక్కలు’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. విదేశీ విద్య కోసం ఎంత ఖర్చు అవుతుందో అంత మేర పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తామని సీఎం ప్రకటించారు. ఉన్నత, విదేశీ విద్య అభ్యసించాలనే కోరికలు, ఆశలను విద్యార్థులు చంపుకోవాల్సిన అవసరం లేదన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-3.0 కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం, భామిని గ్రామంలో ఏపీ మోడల్ హైస్కూల్లో జరిగిన పీటీఎం 3.O కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరెంట్, టీచర్, విద్యార్థులతో సీఎం మాట్లాడారు.మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన వివిధ ల్యాబ్స్ ను పరిశీలించారు. అలాగే క్లిక్కర్ టూల్ ద్వారా విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారనే అంశాన్ని స్వయంగా పిల్లలతో కలిసి కూర్చుని చూశారు. మూడేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ చేసేలా ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేష్ చెప్పారు. విలువలతో కూడిన సమాజాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో పని చేస్తున్నాం. దానికి సహకరించాలని చాగంటి కోటేశ్వరరావును కోరాం చాగంటి ప్రవచనాల ద్వారా విలువలను విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుంటున్నారు.   విదేశాలకు వెళ్లి టీచర్లు అధ్యయనం చేస్తున్నారు.  సామాజిక బాధ్యతగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టే బాధ్యత విద్యార్థులకూ ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు

లోకేష్ విద్యాభ్యాసం గురించి బాబు…

‘మంత్రి లోకేష్ చదువుకునే రోజుల్లో ఎలా చదువుతున్నారనే విషయమాన్ని తెలుసుకునేందుకు నేను ఎప్పుడూ స్కూలుకు వెళ్లలేదు… లోకేష్ కు చదువు చెప్పే టీచర్లతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అంతా లోకేష్ తల్లి భువనేశ్వరీనే చూసుకునేవారు. కొన్ని అంశాల్లో లోకేష్‌కు ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించాం.. ఆ తర్వాత చక్కగా చదువుకున్నారు… ఇప్పుడు మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మని లోకేష్ ను నేను ఫోర్స్ చేయలేదు. వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటే వ్యాపారమే చేసుకోవాలని కూడా సూచించాను. కానీ లోకేష్ రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చారు. విద్యా శాఖ చాలా కష్టంగా ఉంటుందని చెప్పినా… విద్యా విధానాన్ని తీర్చిదిద్దేలా పని చేస్తానని లోకేష్ చెప్పారు. దానికి అనుగుణంగానే విద్యాశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు మంత్రి లోకేష్‌ను అభినందిస్తున్నా. భువనేశ్వరి లోకేష్ ను స్టాన్ ఫోర్డ్ వరకు తీసుకెళ్లారు… ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులను కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యా శాఖ మంత్రి లోకేష్ దే.’అని ముఖ్యమంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *