490 వెంటిలేటర్ బెడ్లు – 9 ఎంఆర్ఐ యంత్రాలు ఏర్పాటు
నిమ్స్ లో 850 పోస్టుల భర్తీ చేస్తాం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను మరింత ఆధునీకరిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నపరిస్థితులను వివరిస్తూ….ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్లో సుమారు 1790 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయని చెప్పారు. అత్యవసర వైద్య సేవలను దృష్టిలో ఉంచుకుని వీటిసంఖ్యను మరింతపెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం వంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, జిల్లా హాస్పిటళ్లలో వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

నిమ్స్లో అదనంగా మరో 125 వెంటిలెటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిమ్స్ కు ఆసుపత్రికి అచంనాలకు మించి పేషంట్లు వస్తున్నారని అందుకు అనుగుణంగా ఇక్కడ వైద్య సేవలను మెరుగు పరిచేందుకు 850 పోస్టులను భర్తీ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. గాంధీ, ఉస్మానియా, ఆదిలాబాద్ రిమ్స్, ఎంజీఎంలో మాత్రమే ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయి. మరో 9 ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎంఆర్ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. .గతేడాది కొత్తగా 213 అంబులెన్స్లను అందుబాటులోకి తేవడంతో ఎమర్జన్సీ రెస్పాన్స్ 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గింది.ఈ ఏడాది మరో 79 కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేస్తామని ఇవి అందుబాటులోకి వస్తే…..ఎమర్జన్సీ రెస్పాన్స్ టైమ్ 10 నిమిషాలకు తగ్గుతుందని మంత్రి వెల్లడించారు. . 20 నిమిషాల ప్రయాణంలోనే డయాలసిస్ సెంటర్ కు చేరుకునేలా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.





Leave a Reply