NewsInn

News in a Click

జల వివాదాల శాశ్వత పరిష్కారం నా లక్ష్యం

జల వివాదాల శాశ్వత పరిష్కారం నా లక్ష్యం

కాళేశ్వరం నిర్మాణానికి నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు

కృష్ణా గోదావ‌రి న‌దుల అనుసంధానం జ‌రుగాలి

తెలుగు రాష్ట్రాల ఐక్యతతోనే… తెలుగు జాతి పురోగతి

ఏపీ సీఎం చంద్ర‌బాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య త‌లెత్తున జ‌ల‌వివాదాల ప‌రిష్కారం నా ల‌క్ష్యం అని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రాలుగా విడిపోయినా…… తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. గుంటూరులో సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని తపాల శాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ… ‘మనం రెండు రాష్ట్రాలుగా ఉన్నా, తెలుగే మనకు మాతృభాష. తెలుగు వారంతా ఐకమత్యంగా ఉంటేనే అగ్రస్థానంలో నిలుస్తాం. సాగునీటి వ్యవస్థకు దారి చూపింది ఎన్టీఆర్. ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ కాలువలు తెచ్చారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిగా కల్వకుర్తి లిఫ్ట్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేశాను. కృష్ణా డెల్టా ఆధునీకరణతో నీటిని పొదుపు చేసి 20 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. గోదావరి నదిపై అలీ సాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టాం. ఆంధ్రా ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తెచ్చాం. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు అందించాం. ప్రతి ఏడాది గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతోంది. గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీళ్లను తెలంగాణ వాడుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదు. ఏపీలో నదులను అన్నింటినీ అనుసంధానించాలి. కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

భాషాభివృద్ధికి స‌హ‌క‌రిస్తాం….

దేశంలో కేవలం 6 భాషలకే ప్రాచీన హోదా లభించాయి. అందులో తెలుగు ఉండటం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య 10 కోట్లకు పైగానే ఉంది. ఈ సభలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం సంతోషదాయకం. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, భాష గొప్పదనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. తమిళనాడు, కర్నాటక, ఒడిశా, బెంగాల్‌లో కూడా తెలుగు చదివే విద్యార్ధులు ఉన్నారు. దేశంలో జాతీయ భావన పెరగాలి. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి. ఇది దేశ ప్రజల మధ్య ఐక్యత తెస్తుందన్నారు. 2022లో భీమవరంలో, 2024లో రాజమండ్రిలో, ఇవాళ గుంటూరులో ఈ సంబరాలు చేస్తున్నారు. 2027లో మారిషస్ లో నిర్వహించ తలపెట్టారు. తెలుగు మహా సభలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. విలువలు నేర్పేది సంస్కృతి. ఆ సంస్కృతికి మూలం భాష.. భాషాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

టెక్నాలజీతో భాషను కాపాడుకోవడం సులభం…..

నా రాణిస్తాం. టెక్నాలజీ వల్ల భాషను కాపాడుకోవడం సులభతరం అవుతుంది. ఉద్యోగానికి, ఉపాధికి ఇంగ్లీష్ అవసరం. జీవితానికి మాతృభాష అవసరం. భాష కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాదు. అది మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు ఆధారం. మాతృభాషను కాపాడితేనే సంస్కృతి నిలబడుతుంది. సమైక్యాంధ్రలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా నవ్యాంధ్రలో రెండోసారి ముఖ్యమంత్రి పనిచేసే అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు జీవితమంతా రుణపడి ఉంటాను. చాలా దేశాల్లో జనాభా తగ్గుతోంది. వయోవృద్ధులు పెరుగుతున్నారు. మన దేశానికి యువత గొప్ప వరం. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *