లేదంటే ప్రజలు ఉద్యమిస్తారు
పట్నం మహేందర్ రెడ్డి హెచ్చరిక
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నగరశివార్లలోని రంగారెడ్డి జిల్లా భూములను అమ్ముకంటూ ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయని, ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే పరిస్థితి ఎదురౌతుందని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి శాసనమండలిలో ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. జిల్లాలో అమ్ముతున్న భూములతో ప్రభుత్వం ఆర్ధికంగా గట్టెక్కుతున్నా….జిల్లా అభివృద్ధికి నిధులకు నోచుకోవడం లేదని ఆయన వాపోయారు.శాసనమండలిలో మట్లాడిన మహేందర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నాడు ఎన్టీ రామారావు మొదలు నేటి వరకు ముఖ్యమంత్రులంతా జిల్లా భూములను అమ్ముతూ రాష్ట్రంలో సంక్షేమపథకాలు అమలు చేయడం అనవాయితీగా మారిందన్నారు.

ప్రభుత్వాలు ఈ జిల్లా నుంచి ఆదాయం పొందుతున్నా…అందుకు అనుగుణంగా అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోవడాన్ని మహూందర్ రెడ్డి తప్పుబట్టారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తనను, తమలాంటి నాయకులను ప్రశ్నిస్తే….సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. భూ విక్రమాలతో వస్తున్న ఆదాయంలో 40 శాతం నిధులు జల్లా అభివృద్ధికే కేటాయించాలన్నారు. ప్రభుత్వాల తీరు ఇలాగే కొనసాగితే….. జిల్లాలో ప్రజలు తిరగబడే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. మహేందర్ రెడ్డి వెల్లడించారు.






Leave a Reply