(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు గుజరాత్ టైటన్స్ ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 254 పరుగులు చేసి గుజరాత్ ముందు 255 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ స్కోరు సాధించే క్రమంలో మొదటి బంతి నుంచి వత్తిడిలో ఉన్న గుజరాత్ బ్యాటింగ్ ను పవర్ ప్లే లోనే బెంగుళూరు బౌలర్లు కుప్ప కూల్చారు. మంచి ఫాంలో ఉన్న గుజరాత్ కీలక బ్యాటర్లంతా పవర్ ప్లే లోనే పెవీలియన్ చేరుకోవడంతో గుజరాత్ మ్యాచ్ గెలుపుపై ఆశలు వదులుకుంది.గుజరాత్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలన్న లక్ష్యంగానే ఇన్నింగ్స్ ఆడడం మొదలు పెట్టింది. విజయం చేజారీ పోవడంతో ఇన్నింగ్స్ లో అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకుంది. నిర్ణీత ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో బెంగుళూరు 92 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది.

ప్రతిమ్యాచ్ లో శుభారంభాన్ని అందించిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ లో కూడా ఇన్నింగ్స్ ధాటిగానే మొదలు పెట్టారు. 9 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 ఫోర్లతో 14 పరుగులు చేసి దురదృష్ట వశాత్తు బ్యాట్ చేతి నుంచి జారీ వికెట్ల పై పడడంతో ఔటయ్యారు. ఆ తరువాత వికెట్ల పతనం క్రమంగా మొదలైంది. కెప్టన్ గిల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యారు. జోరుగా బ్యాటింగ్ చేసిన బట్లర్ 11 బంతుల్లో 29 పరుగులు రాబట్టారు. 4 ఫోర్లు, 2 సిక్స్ లతో విరుచుకు పడ్డ బట్లర్ ను హేజీల్ ఉడ్ బౌల్డ్ చేయడంతో గుజరాత్ విజయం పూర్తిగా ఆశలు వదులు కుంది.
ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన సింధూ, వాషింగ్టన్ సుందర్, హోల్డర్,రషీద్ ఖాన్ లు 5,8,0,8 పరుగులు మాత్రమే స్వల్ప స్కోర్లు చేసి ఔటయ్యారు. క్రీజులో ఉన్న రాహూల్ తేవాటియా,సిరాజ్ లో కొద్ది సేపు ఆర్సీబీ బౌలర్లను ప్రతిఘటించారు. గుజరాత్ బ్యాటర్లలో రాహూల్ తేవాటియా మాత్రమే రాణించారు. 43 బంతులు ఎదుర్కొన్ని తేవాటియా 8 ఫోర్లు, 4 సిక్స్ లతో 68 పరుగులు చేశారు. ఇదే ఆ జట్టులో అత్యధిక స్కోరు.జాకబ్ డఫీ 3, రసిఖ్ సలాం 2, భువనేశ్వర్ 2, కృణాల్ పాండ్య 2 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ గెలుపుతో ఆర్సీబీ మరోసారి ఐపీఎల్ ఫైనల్స్ లో బెర్త్ ఖరారు చేసుకుంది.











Leave a Reply