NewsInn

News in a Click

న‌కిలీ డిగ్రీ పై ఫిర్యాదు- ప‌ట్టా స్వాధీనం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో నకిలీ బీకాం డిగ్రీ పట్టా ఓ మ‌హిళ‌తో ఉంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అంద‌డంతో పోలీసులు స్పందించారు. ఆ మ‌హిళ స‌ర్టిపికెట్లు ప‌రిశీలించేందుకు ఆ మ‌హిళ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె స‌ర్టిఫికెట్లు ప‌రిశీలించి డిగ్రీ స‌ర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నారు. న‌కిలీ డిగ్రీ స‌ర్టిఫికెట్ ఉన్న కటికే మహేశ్వరి అలియాస్ రేష్మ అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లో బీకాం పూర్తి చేసిన‌ట్లు పేరు మీద జారీ చేసినట్లు ఉన్న బీకాం డిగ్రీ పట్టా లభ్యం కావ‌డంతో ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ ను పోలీసులు సిజ్ చేశారు ఈ సర్టిఫికెట్‌పై పోలీసులు ఆ మ‌హిళ‌ను ప్రశ్నించగా ఆమె పొంతన లేని సమాధానం ఇవ్వ‌డంతో అదుపులోకి తీసుకొని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించి విచారించారు. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్‌ను 2009 సంవత్సరంలో పొందినట్లు పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది.ఈ ఘటనపై సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *