దమ్ముంటే రేవంత్ నిలదీయాలి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అడ్డగోలుగా తిట్టిన రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు మరిచిపోయారని కేటిఆర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు గతంలో రేవంత్ రెడ్డి అనేకసార్లు చేశారన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి “ముద్దపప్పు” అన్నాడని, అదే మాటను నేను రిపీట్ చేసినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి సోనియా గాంధీని “వెయ్యి మందిని బలి తీసుకున్న బలిదేవత… తెలంగాణ పిల్లల్ని చంపింది” అని అన్నాడని, అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే రేవంత్ రెడ్డిపై ప్రతాపం చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిని తప్పుపట్టడం చేతగాని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్న తీరు హస్యాస్పదంగా ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. GHMC ఎన్నికలను ప్రభుత్వం త్వరలో పెడుతుందన్న వార్తలు వస్తున్నాయని, ఈ ఎన్నికలను పార్టీ శ్రేణులంతా కలిసి సమిష్టిగా ఎదుర్కొని విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 9700 కోట్ల రూపాయల అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రజలకు ప్రస్తావించాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన తీరు ప్రతి డివిజన్లోని ఓటర్లకు ప్రజలకు ప్రచారం చేయాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మన పార్టీ తరఫున గెలిచి కేవలం భూములను కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి పక్కాన ఎమ్మెల్యే గాంధీ డబ్బులకు అమ్ముడుపోయాడన్నారు.






Leave a Reply