యూనివర్సిటీ భూములతో ప్రభుత్వం రియల్ వ్యాపారం కేటిఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశంలోనే ఉన్న ఏకైక్ ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రను చేస్తోందిన బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. ఉన్నత విద్య కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండాన్ని తీప్పుబట్టారు. 50 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ వ్యాపారం కోసం సీఎం రేవంత్ చర్యలు చేపట్టడాన్ని కేటీఆర్ తప్పు బట్టారు. నందినగర్ నివాసంలో ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అనంతరం కేటిఆర్ మీడియాతో మాట్లాడారు. హై కోర్టు పేరు చెప్పి వ్యవసాయ యూనివర్సిటీ భూమిని స్వాధీనం చేసుకుందని, సెంట్రలో యూనివర్సిటీ భూములను కొల్లగొట్టే యత్నం చేసినా కేంద్రం స్పందించ లేదని విద్యార్థుల ఆందోలనతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తాత్కలికంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆపివేసిన విషయాన్ని గుర్తు చేశారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే… రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో సెంట్రల్ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ భూములపైన కన్ను వేసేది కాదన్నారు.

ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మా పార్టీ తరఫున అండగా ఉంటామని ప్రకటించారు. ఈ అంశంపై అవసరమైతే రాజ్యసభ లో మా పార్టీ సభ్యులు లేవనెత్తుతారని చెప్పారు. దేశంలో మైనార్టీల సంరక్షకుడిని అని చెప్పుకునే రాహుల్ గాంధీ… ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడమే కాపాడడమా అని కేటిఆర్ ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న సమస్యల పైన రాహుల్ గాంధీ మాట్లాడాలి కానీ వారి భూములు గుంజుకుంటున్న తమ ప్రభుత్వం పైన స్పందించకపోవడం దారుణం సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది గతంలో తెలంగాణలో జరిగిన ఉద్యమం వల్లనే హైదరాబాదులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పడిన విషయాన్ని కేటిఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమం, త్యాగాల కారణంగా ఏర్పడిన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ కోసం వాడడం దారుణం ఉందని వ్యాఖ్యానించారు.
నిరుద్యోగులపై లాఠీ చార్జ్ ధారుణం…..
ఉద్యోగాలు కోసం సిద్ధం అవుతున్న నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపితే లాఠీ చార్జ్ చేయడం ధారుణమని కేటిఆర్ వ్యాఖ్యానించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇష్టమని చెప్పి ఎందుకు రాహుల్ గాంధీ నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఈరోజు విద్యార్థుల పైన పోలీసులతో దాడులు చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.







Leave a Reply