(హైదరాబాద్, స్పోర్ట్స్ బ్యూరో )
వడోదరాలో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్ డే మ్యాచ్లో భారత్ సునాయసంగా బిగ్ చేజ్ చేసి విజయం దక్కించుకుంది. 4 వికెట్ల గెలుపొందింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 50 ఓవర్లలో 300 పరుగులు చేసింది. భారత్ ముందు 301 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరి ఓవర్ వరకు జరిగిన మ్యాచ్ లో భారత్ నే విజయం వరించింది.
🏏 భారత విజయం వెనుక రన్ మిషిన్…..
విరాట్ కోహ్లి…..
ఈ మ్యాచ్లో 91 బంతుల్లో 93 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ భారత్ ను విజయం అంచుల దాకా తీసుకు వచ్చాడు. అధ్బుతమైన ఫీల్డింగ్ తో విరాట్ అవుట్ సెంచరీకి ముందు నిరాషతో పేవిలియన్ చేరుకున్నారు. ఆస్త్రం ఇచ్చాడు. వత్తిడిలో తనకు తానే సాటినని మరోసారి కొహ్లీ ఈ ఇన్నింగ్స్ తో మరోసారి నిరూపించారు. తొలివికెట్ గా రోహిత్ శర్మ మొదట్లోనే అవుటైనా…… శుభన్ గిల్ తో కలిసి కొహ్లీ ఇన్నింగ్స్ ను చక్క దిద్దారు. ఆ తరువాత గిల్ అవుట్ కాగా శ్రేయస్ అయ్యర్ తో కలిసి భారత్ కుభారీ విజయాన్ని దక్కించేలా విరాట్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతూ వచ్చారు.

సెంచరీకి చేరువల ఉన్న సమయంలో అనూహ్యంగా విరాట్ అవుట్ అయ్యారు. ఆ తరువాత కొద్ది సేపటికే శ్రేయాస్ అవుట్ అయ్యారు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన జడెజా కూడా ఎక్కువ సేపు క్రీస్ లో నిలదొక్కులేకపోయారు. దీంతో న్యూజిలాండ్ కు గెలుపు పై ఆశలు పెంచాయి. కానీ కేఎల్ రాహుల్, హర్షిత్ రాణాలు భారత్ విజయం దక్కించారు. అంతకు ముందు భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణాలు న్యూజీలాండ్ బ్యాటింగ్ జోరుకు కళ్లేం వెయగలిగారు.
న్యూజిలాండ్ బాగా ఆడింది….., తప్పులతో ఓటమి
ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ మంచి బ్యాటింగ్ చేసింది. 300 పరుగుల భారీ స్కోరు చేసింది కానీ చివరి 10 ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు స్కోరు మందగించింది. మొదటి వికెట్ కు భారీ భాగస్వామ్యం లభించినా….. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా చూపించింది.
న్యూజిలాండ్ …. 300 స్కోర్
భారత 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది
కోహ్లి 93 రన్స్ — భారత జట్టు విజయానికి కీలకంగా మారాయి
కేఎల్ రాహూల్ 29 నాటౌట్
మొదటి మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో సీరిస్ లో 1-0 ఆధిక్యత సాధించింది.










Leave a Reply