NewsInn

News in a Click

హెచ్ సీ ఏ హైదరాబాద్ కే పరిమితం : ఎంపీ కొండా

హెచ్ సీ ఏ హైదరాబాద్ కే పరిమితం : ఎంపీ కొండా

(హైదరాబాద్,న్యూస్ఇన్)

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం హైదరాబాద్ దగ్గర పరిమితం అయిందని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు న్యాయం జరగడం లేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో నిర్వహించిన “రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ స్టేక్‌హోల్డర్స్” కార్యక్రమంలో క్రికెట్ నిర్వాహకులు, మాజీ క్రీడాకారులు, మహిళా క్రికెటర్లు, జిల్లా ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.
టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీసీఏ గురించి,ప్రస్తుత ప్రగతిని వివరించారు.

Telangana Cricket Association Round Table

చేవెళ్ల ఎంపీ, టీసీఏ పాట్రన్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హెచ్‌సీఏ హైదరాబాద్‌కే పరిమితమై తెలంగాణ జిల్లాల క్రికెట్‌ను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. క్రికెట్ అభివృద్ధి కంటే కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా తెలంగాణ యువ క్రీడాకారులు దశాబ్దాలుగా అవకాశాలు కోల్పోయారని అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు టీసీఏ నిరంతరం కృషి చేస్తోందని, బీసీసీఐ టీసీఏకు అసోసియేట్ సభ్యత్వం కల్పిస్తే వేలాది మంది క్రీడాకారులకు జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయన్నారు. టీసీఏ గుర్తింపు కోసం ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఖమ్మం, వరంగల్ నుండి వచ్చిన TCA మహిళా క్రికెటర్లు ఝాన్సీ,వినోద లు మాట్లాడుతూ,
క్రికెట్ నే నమ్ముకొని,ఆస్తులు అమ్ముకొని,కష్టపడి క్రికెట్ నేర్చుకొని,జాతీయ స్థాయిలో ఆడినా HCA మమ్మల్ని గుర్తించలేదని,కేవలం డబ్బులు ఇవ్వలేదనే మమ్నల్ని గుర్తించలేదని ఆరోపించారు.హెచ్‌సీఏపై వెలుగుచూసిన అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *