మహిళా అధికారులకు అండగా నేతలు, ఉద్యోగులు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మహిళా IAS అధికారుల మానసిక స్థైర్యం కోల్పోయేలా కొన్ని వార్తా సంస్థలు వార్తలు వెలువరించడంతో అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగ రీత్యా అందరితో మాట్లాడే అవకాశం ఉంటుందని అయితే…దీన్ని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేయడంపై అధికారుల సంఘం తప్పబట్టింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. తన కుమారుడు మృది చెందిన నాడే సగం తాను మరణించానని , ఇక విషం ఇచ్చి పూర్తిగా చంపండి అంటూ మీడియా సమావేశంలో ఆందోళన వక్తం చేశారు. కోమటిరెడ్డికి మద్దతుగా అధికార పార్టీ నేతలు ఒక్కొక్కరు రంగంలోకి దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాలో వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించారు.ఇలాగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రెండు,మూడు రోజులుగా హెచ్చరికలు చేశారు. మహిళా IAS అధికారులకు ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు మీడియా సంస్థలపై కేసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే మీడియా సంస్థలన్నీంటినీ పోలీసులు ఒకే గాటిన కట్టి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల్లో మహిళా అధికారులను, మంత్రులను కించపరుస్తూ వార్తలు ప్రసారం చేయకున్నాఆ సంస్థలపై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు కావడం మరో వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం తరపున మొదటిసారి ఏకపక్షంగా మీడియా వైఖరిపై అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.







Leave a Reply