NewsInn

News in a Click

ఎమ్మెల్యేలపై తీర్పులు… స్పీక‌ర్ కు ముడుపులు ?

ఎమ్మెల్యేలపై తీర్పులు… స్పీక‌ర్ కు ముడుపులు ?

మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోప‌ణ‌

స్పీక‌ర్ కు సుప్రీం నోటీసులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం గ‌త కొన్ని నెల‌లుగా సాగుతోంది. బీఆర్ ఎస్ పార్టీ నుంచి విజ‌యం సాదించిన 10 మంది శాస‌న‌స‌భ్యులు కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో బీఆర్ ఎస్ వారిపై అనర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ కు పిటీష‌న్లు స‌మ‌ర్పిస్తూనే…. సుప్రీం కోర్ట‌ను ఆశ్ర‌యించింది.దాదాపు రెండేళ్లుగా ఫిరాయింపుల విష‌యాన్ని ప‌ట్టించుకోని స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఇటీవ‌ల ఒక్కో పిటీష‌న్ గురించి త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్ర‌కారం స్పీక‌ర్ ఇటీవ‌ల కాలంలో ఈ విచారణ‌ను వేగ‌వంతం చేసి నిర్ణ‌యాల‌ను వెల్లడించారు.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్లు ఎలాంటి ఆధారాలు లేవ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన ఎమ్మెల్యేల విష‌యంలో స్పీక‌ర్ వెల్ల‌డించిన తీర్ప ఇది. దీనిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన బీఆర్ ఎస్ స్పీక‌ర్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. పార్టీ మారుతున్న‌ట్లు ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంటూ స్పీక‌ర్ పార్టీ ఫిరాయింపు ఆధారాలు లేవ‌ని ప్ర‌క‌టించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ వ‌స్తోంది. తాజాగా ఈ విష‌యంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఘాటుగా స్పందించారు. స్పీక‌ర్ గా గౌర‌వ ప్ర‌ద‌మైన హోదాలో ఉన్న గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ పై సోష‌ల్ మీడియాలో ఎన్నో విమ‌ర్శలు వ‌స్తున్నాయ‌న్నారు.దీంతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయకుండా ఎన్ని కోట్ల ముడుపులు పుచ్చుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. ఈ కార‌ణంగానే పూర్తి ఆధారాలు ఉన్నా… ఎమ్మెల్యే ల‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌కుండా స్పీక‌ర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కాప‌డుతున్నార‌ని చెప్పారు.

స్పీక‌ర్ కు నోటీసులు….

మ‌రోవైఫు ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్య‌వ హారం వెల్ల‌డిస్తున్న స్పీక‌ర్ తీర్పుల‌ను స‌వాల్ చేస్తూ బీజెఎల్పీ నేత మహేశ్వ‌ర్ రెడ్డి సుప్రీం కోర్ట‌ను ఆశ్ర‌యించారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డి కేసును ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సుప్రీం స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై తీర్పుపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. అయితే బీఆర్ ఎస్ సుప్రీం కోర్టులో వేసిన కేసు కూడా విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఫ్రిబ‌వ‌రి 6వ తేదీన ఈ రెండు పిటీష‌న్ల‌ను క‌లిపి విచారిస్తామ‌ని సుప్రీం కోర్టు వెల్ల‌డించింది. మొత్తం మీద స్పీక‌ర్ వెలువ‌రిస్తున్న నిర్ణ‌యాలు మ‌రింత వివాదాస్ప‌దంగా మారుతున్నాయి.

కాంగ్రెస్ లో చేరి త‌ప్పు చేశాను….గూడెం మ‌హిపాల్ రెడ్డి

ఫిరాయింపుల కేసు కొలిక్కి రాక‌ముందే కాంగ్రెస్ పార్టీలో చేరి తాను త‌ప్పుచేశాన‌ని ప‌ఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని మున్సిపాల్టీలో బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరారు.

పార్టీలో చేర‌లేద‌ని ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేరిన‌ట్లు ఆధారాలు లేవ‌ని స్పీక‌ర్ త‌న నిర్ణ‌యాలు వెల్ల‌డిస్తున్న స‌మ‌యంలో బీఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఆ పార్టీలో చేరి త‌ప్పు చేశాన‌ని ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌కు దారి తీస్తోంది. అయితే ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం స్పీక‌ర్ వెల్ల‌డిస్తార‌న్న‌ది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. దానం నాగేంద‌ర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌గా క‌డియం శ్రీహ‌రి కూత‌రు క‌డియం కావ్య ఎంపీగా పోటీ చేయ‌డంతో క‌డియం ప్ర‌తిపాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *