NewsInn

News in a Click

వివాదంలోకి ఎక్స్ పీరియం ఎకో పార్క్ భూసేక‌ర‌ణ‌

వివాదంలోకి ఎక్స్ పీరియం ఎకో పార్క్ భూసేక‌ర‌ణ‌

రాందేవ్ రావుపై రైతుల ఆరోపణలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప్ర‌కృతి ప్రేమికుల‌ను,ప‌ర్యాట‌కుల‌ను పెద్ద ఎత్తున ఆక‌ర్షించేందుకు న‌గ‌రానికి స మీపంలో ఎక్స్ పీరియం పార్క్ పేరుతో వంద‌లాంది ఎక‌రాల్లో ర‌క‌,ర‌కాల మొక్క‌ల‌ను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నాలుగైదేళ్లుగా ఈ ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతూ ఉన్నాయి.దాదాపు ప‌దేళ్లుగా ఈ ప్రాజెక్టు ప‌నులు ఆ ప్రాంతంలో సైలెంట్ గా జ‌రిగాయి. . న‌గ‌రానికి శివారు ప్రాంతం కావ‌డం….. దేశంలో ఎక్క‌డా క‌నిపించ‌ని విధంగా ఒకే చోట వేలాది ర‌కాల మొక్క‌లు ఉండ‌డం ప్ర‌కృతి ప్రేమికుల‌ను ఆక‌ర్షించింది. ఇటీవ‌లి కాలంలో ఎకో పార్క్ ను సంద‌ర్శించే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ పార్క్ ఏర్పాటు చేసేందుకు య‌జ‌మాని రాందేవ్ రావు క్ర‌మంగా స‌మీపంలోని భూముల‌ను కొనుగోలు చేస్తూ పార్క్ ను ఏర్పాటు చేశారు. ఈ స‌మ‌యంలో కొంత మంది రైతులు త‌మ భూముల‌ను ఐదేళ్ల లీజుకు అని చెప్పి తీసుకున్నార‌ని, ఇప్పుడు 99 ఏళ్ల లీజుగా మార్చార‌ని రైతులు ఆందోళ‌న బాట ప‌డుతున్నారు.

లీజుకు తీసుకున్న స‌మ‌యం పూర్తి కావ‌డంతో త‌మ భూముల‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని కోరితే రాందేవ్ రావ్ త‌మ‌ను భ‌య భ్రాంతుల‌కు గురిచేస్తున్నార‌ని రైతులు ఆరోపిస్తున్నారు.త‌మ భూముల‌ను తీసుకుని మోసం చేస్తున్న రాందేవ్ రావ్ నుంచి త‌మ‌కు భూములు ఇప్పించాల‌ని రైతులు ఉన్న‌తాధికారుల‌ను కోరుతున్నారు.గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, చిరంజీవిలు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. న‌గ‌రానికి స‌మీపంలో ఉండ‌డంతో ఎంతో మంది న‌గ‌ర ప్ర‌జ‌లు ఎకో పార్క్ ను సంద‌ర్శించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ప్ర‌ముఖులు ఈ పార్క్ న ప్రారంభించ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.ఈ పార్క్ ప‌నులు ఇంకా పూర్తి కాలేదు. అయినా….వ్యాప‌ర ప‌రంగా కార్య‌క‌లాపాల‌ను మొద‌లు పెట్ట‌డంతో ప‌ర్యాట‌కుల‌ను పెద్ద ఎత్తున ఆక‌ట్టుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *