మైనింగ్ మాఫియాకు సంతోష్ అండ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై కల్వకుంట్ల రమ్యారావ్ డిజీపికి ఫిర్యాదు చేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంతోష్ రావ్ చేసిన అక్రమాలపై పూర్తి ఆధారాలు సమర్పించినట్లు రమ్యారావ్ వెల్లడించారు. 2013 నుంచి సంతోష్, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ లు ఇసుక క్వారీలు నిర్వహిస్తూ అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రమ్యరావ్ ఆరోపించారు. డీజీపి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రమ్యరావ్ సంతోష్ రావ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక క్వారీల్లో అక్రమంగా సంపాదించిన డబ్బులతో లిక్కర్ స్కాంలో పెటుబడులుగా పెట్టారని ఆరోపించారు. కేసిఆర్ పేరు చెబుతూ అనేక భూదంధాలకు సంతోషో అండ్ టీం పాల్పడిందని విమర్శించారు.

అప్పటి నుంచి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రమ్య ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా…ఇంకా తాము సంతోష్ రావ్ టీం టార్గెట్ లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.సంతోష్, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ అక్రమంగా క్వారీలు తమ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారన్నారు. మైనింగ్ మాఫియాకు సంతోష్ అండగ నిలబడడంతో గతంలో హోటళ్లలో పనిచేసిన వారు ఇప్పుడు వేల కోట్ల రుపాయాల ఎలా సంపాదించారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాం విచారణ సమయంలో.. CBI, ED లాంటి వ్యవస్థలకు కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు.. మిడ్ మానేరు నిర్వాసితుల లిస్ట్ లో జోగినిపల్లి సంతోష్ పేరు కూడా ఉంది.అందులో బీసీ అని ఉంది. సంతోష్ బీసీ ఎప్పుడు అయ్యారని ప్రశ్నించారు. మిడ్ మానేరు నిర్వాసితుల పేరుతో జోగినిపల్లి కుటుంబం మొత్తం లెక్కలేనన్ని ప్లాట్లు తీసుకున్నారని ఆరోపించారు.




Leave a Reply