ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎన్నార్టీలు ఎదగాలి
జ్యూరిచ్ తెలుగు డయాస్పోరా లో సీఎం చంద్రబాబు
(అమరావతి,న్యూస్ఇన్)
తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని సీఎం ఆకాంక్షించారు. వినూత్న రీతిలో ఆలోచన చేస్తే… ఉద్యోగాలు చేసే ఎన్నార్టీలు పారిశ్రామిక వేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశీ విద్యాభ్యాసం కోసం ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.దావోస్ తొలి రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”దావోస్ కు నేను తొలిసారి వచ్చినప్పుడు భారతీయులు తక్కువగా ఉన్నారు… తెలుగు వాళ్లు అసలు లేరు. ప్రస్తుతం ఉన్నది విజయవాడలోనా.. తిరుపతిలోనా అనేలా జ్యూరిచ్ లో పరిస్థితి ఉంది. 20 దేశాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారు…148 దేశాల్లో ఎన్నార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆనాడు తీసుకున్న నిర్ణయం వల్ల 195 దేశాలకు తెలుగు వారు వెళ్లడానికి అవకాశం కల్పించింది. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం గర్వకారణం. 2047కు భారత దేశం ప్రపంచంలో నెంబర్ ఎకానమీ దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో సహకారం మరవలేం….
సవాళ్లను ఎదుర్కోవాలి… ఇబ్బందులను అధిగమించాలి… దీన్ని యువత అందిపుచ్చుకోవాలి. పదవులు వస్తే గ్లామరే కాదు… రాళ్లు కూడా పడతాయి. వీటిని ఎదుర్కొనడం యువత అలవరచుకోవాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నార్టీలు అద్భుతంగా పని చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ సహకరించారు, బీజేపీ కలిసి వచ్చింది. రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలి… సహకరించమని ఎన్నార్టీలను కోరితే క్షణం కూడా ఆలోచన చేయకుండా తరలి వచ్చారు…రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చి విదేశాల్లో స్థిరపడ్డారు… మీ ఊళ్లల్లో ఉన్న వారిని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు.
విదేశీ విద్య… మా బాధ్యత

“చదువు కోవాలని అనుకునే ప్రతి ఒక్కరినీ చదివిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా మంచి యూనివర్శిటీలు ఎక్కడున్నా విద్యార్థులకు అవకాశాలు అందేలా చేస్తాం. 4 శాతం వడ్డీతో రుణాలు ఇప్పించి విదేశీ విద్య అందించేలా మేం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇస్తాం. ఏపీ ఫస్ట్ అనే అతి పెద్ద రీసెర్చ్ వ్యవస్థను తెస్తున్నాం. ఐఐటీ-ఐఐఎస్ఈఆర్ కాంబినేషన్ తో ఈ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో స్థాపిస్తున్నాం. కొత్త ఆవిష్కరణలతో యువతకు ఉపాధి చూపించేలా కృషి చేస్తున్నాం.






Leave a Reply