NewsInn

News in a Click

సింగరేణి కుంభకోణంపై CBI విచారణ చేయాలి

సింగరేణి కుంభకోణంపై CBI విచారణ చేయాలి

బి ఆర్ ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు

మంత్రి కిషన్ రెడ్డికి లేఖ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం బొగ్గు మ‌ర‌క‌లు అంటుకుంటున్నాయి. అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చిన నైనీ బొగ్గు టెండ‌ర్ల వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా మారింది. రాజ‌కీయంగా ఈ అస్త్రాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని గులాబీ పార్టీ పావులు క‌దుపుతోంది. ఈ వ్య‌వ‌హారం అదికార పార్టీలో ఎవ‌రి మెడ‌కు చుట్టుకుంటుంద‌న్న‌ది అంతు చిక్క‌ని వ్య‌వ‌హారంగా మారింది. ఈ ప‌రిస్థితుల్లో మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ను పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచార‌ణ‌కు పిలువ‌డంతో హ‌రీష్ రావు పోలీసు విచార‌ణ‌కు ముందు కేంద్ర మంత్రి సింగ‌రేణి బొగ్గు కుంభ‌కోణంపై విచార‌ణ జ‌రిపించాల‌ని లేఖ విడుద‌ల చేశారు.

లేఖలోని ముఖ్యాంశాలు………….

టెండర్లలో నిబంధనల మార్పు: 2024లో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, సింగరేణిలో టెండర్లలో పాల్గొనడానికి “సైట్ విజిట్ సర్టిఫికేట్” (Site Visit Certificate) అనే కొత్త నిబంధనను తప్పనిసరి చేశారు. ఈ విధానం సింగరేణి చరిత్రలో గతంలో లేదని, కోల్ ఇండియా లేదా వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ వంటి సంస్థలు కూడా దీనిని అనుసరించడం లేదని పేర్కొన్నారు.

అధిక ధరలకు కాంట్రాక్టులు: గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో తక్కువ ధరలకు (-7% నుండి -20% వరకు) ఖరారైన టెండర్లను రద్దు చేసి, కొత్త విధానంలో అధిక ధరలకు (+7% నుండి +10% వరకు) కాంట్రాక్టులను కట్టబెడుతున్నారని, దీనివల్ల సింగరేణికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు.

డీజిల్ కొనుగోలు విధానం: గతంలో ఐఓసిఎల్ (IOCL) నుండి నేరుగా బల్క్ డీజిల్ కొనుగోలు చేసే పద్ధతిని నిలిపివేసి, ఆ బాధ్యతను కాంట్రాక్టర్లకు బదిలీ చేశారు. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, అదనంగా GST భారం పడుతోందని, ఇది సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు.

శాశ్వత సిఎండి ఎందుకు నియమించరు: గత రెండేళ్లుగా సింగరేణికి శాశ్వత సిఎండి (CMD) లేరని, కేవలం ఇన్-ఛార్జ్ ఏర్పాటుతోనే నడుస్తోందని హరీష్ రావు గారు గుర్తుచేశారు. ఈ నాయకత్వ శూన్యత వల్ల సంస్థలో మానిటరింగ్ బలహీనపడి, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర డైరెక్టర్ల మౌనం: సింగరేణి బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా మౌనంగా ఉండటంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు,. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

సిబిఐ విచారణకు డిమాండ్: ఈ అక్రమాలపై అంతర్గత లేదా రాష్ట్ర ప్రభుత్వ విచారణ సరిపోదని, కేవలం సిబిఐ (CBI) విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన కోరారు. 2024 తర్వాత తీసుకున్న టెండర్లు మరియు పాలసీ నిర్ణయాలన్నింటిపై విచారణ జరిపించాలని ఆయన కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *