మున్నిపల్ ఎన్నికలకు ముందు కొత్త డ్రామా
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయం
కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ నుంచి గుంపు మేస్త్రీ, బీఆర్ ఎస్ నుంచి గుంట నక్క లు ఇద్దరు కలిసి కొత్త డ్రామాలకు తెరలేపారని కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణా జాగృతి కార్యాలయంలో మాజీ మంత్రి ముచ్చర్ల సత్యానారయణ జయంతి సందర్బంగా నివాళులర్పించారు. అనంతరం ప్రసంగించిన కవిత సీఎం రేవంత్, బీఆర్ ఎస్ నేత హరీష్ రావ్ లపై విరుచుకుపడ్డారు.

మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వకుడా ఎన్నికలకు వెళుతున్న కాంగ్రెస్ గుంటనక్కను విచారణకు పిలిచి అసలు విషయాన్నితప్పుదోవ పట్టించే యత్నం చేస్తోందని కవిత ఘాటుగా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీకి లేదని కవిత వ్యాఖ్యానించారు. అయినా…బీసీల రిజర్వేషన్ల గురించి బీఆర్ ఎస్ ఎందుకు సైలెంట్ గా ఉంటుందని ప్రశ్నించారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను అంతా పరిశీలించాలన్నరు. గుంపుమేస్త్రీ,గుంట నక్కలు వేర్వేరు కాదని అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే ఇద్దరు కలిసి మరో డ్రామాకు తెరతీశారని కవిత సిఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రిహరీష్ రావ్ లను టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంటుందన్న నమ్మకం తనకు లేదన్నారు. దర్యాప్తు సంస్థల పనితీరు పై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ చేయడం లేదని కవిత స్పష్టం చేశారు.ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు.






Leave a Reply