NewsInn

News in a Click

సింగ‌రేణి పై బీఆర్ఎస్ తో బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధం

సింగ‌రేణి పై బీఆర్ఎస్ తో బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధం

2014 నుంచి కేటాయింపుల‌పై విచార‌ణ‌కు రెడీ

మంత్రి పొన్నం ప్రభాకర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సింగ‌రేణి మైన్స్ విష‌యంలో బీఆర్ ఎస్ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు అన్నీ రాజ‌కీయంగా ఉనికి కాపాడుకోవ‌డం కోసం చేస్తున్న‌వే అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆరోపించారు. బీఆర్ ఎస్ సింగ‌రేణిపై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు ఆ పార్టీ నేత‌ల‌కు వ‌చ్చే ద‌మ్ముందా అని స‌వాల్ విసిరారు.గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్యాల‌యంలో ప‌లు స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడారు.బీఆర్ ఎస్ హయాంలో 21 గనులు ఇస్తే ఒకటి మాత్రమే 0.1తో మైనస్ లో ఇచ్చారన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ ఎస్ చేసిన సింగరేణి లో అక్రమాలు పై కవిత మాకంటే అనేక సార్లు బ‌య‌ట‌పెట్టార‌న్నారు.

సీఎం విదేశీ ప‌ర్య‌ట‌న అనంత‌రం 2014 నుంచి కేటాయించిన గ‌నుల‌పై విచార‌ణ చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని మంత్రి ప్ర‌క‌టించారు. సైట్ విజిట్ నిబంధ‌న బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హాయంలోనే ప్రాసెస్ మొద‌లైంద‌న్నారు. నైనీ బ్లాక్ వేలంలో బీఆర్ ఎస్ 38 శాతం ఎక్సెస్ వేయ‌డంతో టెండ‌ర్ ర‌ద్ద‌యిన విష‌యం బీఆర్ ఎస్ నేత‌ల‌కు తెలియ‌దా అని ప్ర‌శ్నించారు. బీజెపితో ఉన్న అవ‌గాహ‌న కార‌ణంగానే బీఆర్ ఎస్ సీబీఐ విచార‌ణ డిమాండ్ చేస్తోందని పొన్నం ప్ర‌భాక‌ర్ ఆరోపించారు. 2014 నుంచి బొగ్గు గ‌నుల కేటాయింపుపై విచార‌ణ జ‌రిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని వెల్ల‌డించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీబీఐ విచారణ కు ఆదేశించాలని కిషన్ రెడ్డి అడిగారు.. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం పై సీబీఐ విచారణకు ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదని పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌శ్నించారు.బీఆర్ ఎస్ ఆరోప‌ణల‌న్నీ ఇదే విధంగా ఉంటాయ‌ని….హిల్ట్ పాలసీ మీద అనేక ఆరోపణలు చేశారు… అసెంబ్లీ లో చర్చ పెడితే మాట్లాడకుండా తప్పించుకున్నారని వింమ‌ర్శించారు. కృష్ణ జలాల మీద సెంటిమెంట్ రాజేసి రాజకీయ రంగు చేసే ప్రయత్నం చేశారు..శాసన సభ వేదికగా జవాబు చెప్పలేక ముఖం చాటేసార‌న్నారు.టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో కవిత అడిగిన ప్రశ్నకు సమాధానం కేటిఆర్, హ‌రీష్ రావ‌లు చెప్పాల‌ని పొన్నం డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *