NewsInn

News in a Click

ఫోన్ ట్యాపింగ్ కేసు లీకులతోనే ముందుకు వెళుతుంది

ఫోన్ ట్యాపింగ్ కేసు లీకులతోనే ముందుకు వెళుతుంది

మీడియాతో కేటీఆర్

రేవంత్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్

(హైదరాబాద్, న్యూస్ఇన్)

ఫోన్ ట్యాపింగ్ కేసులో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు.అంతకు ముందు తన నివాసం నుంచి పార్టీ కీలక నేత హరీష్ రావు తో కలిసి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు కేటీఆర్ కు మద్దతుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగానే విచారణలు చేస్తోందని ఆరోపించారు.గత 20 ఏళ్లుగా నా రాష్ట్రం కోసం పని చేస్తున్నాన్నారు.అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు చేసిన కుట్రలను అన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ సాధించుకునామని,కాంగ్రెస్ పార్టీ మా పైన కుట్రలు చేయడం కొత్త కాదన్నారు.రాష్ట్రం సాధించిన తర్వాత ఈ ప్రాంతం కోసం ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా నిబద్ధతతో పని చేశామని చెప్పారు. తాము అధికారంలో ఉన్న సమయంలో టైం పాస్ రాజకీయాలు చేయలేదని,ప్రత్యర్థులను ప్రతిపక్ష నేతలను వారి కుటుంబాలను ఏనాడు రాజకీయాల్లోకి లాగలేదు, అక్రమ కేసులు పెట్టి వేధించ లేదని వ్యాఖ్యానించారు.

గత అయిదారు సంవత్సరాలుగా నా పైన తీవ్రమైన దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో,హీరోయిన్లతో సంబంధాలు అంటూ నన్ను అనేక అంశాల్లో ఇరికించాలని చూడడంతో పాటు,నా కుటుంబాన్ని నా పిల్లలను కూడా మానసిక క్షోభకు గురి చేసారన్నారు.కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పైన రేవంత్ రెడ్డి అవినీతి పైన 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటాము. అటెన్షన్ డైవర్షన్ గేమ్ లు ఆడినా అర్జునుడి కన్ను మాదిరి రేవంత్ రెడ్డి అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు పైననే మా పోరాటం ఉంటుంది.అయినా నేను ఎవరికీ భయపడలేదు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలోనూ ఎవరి కుట్రలకు భయపడేదే లేదని స్పష్టం చేశారు.ఫోన్ ట్యాపింగ్ విషయంలో నన్ను విచారణకు పిలిచారు.

ఈ సందర్భంగా పలు ప్రశ్నలను కేటీఆర్ సంధించారు.

గత రెండు సంవత్సరాలుగా ఒక డైలీ సీరియల్ మాదిరి లీకులు ఇస్తూ నా వ్యక్తిత్వ హననం చేస్తున్న వాటికి ఒక్క సాక్ష్యం అయినా ఉన్నదా?

కేవలం మీడియా లీకులే తప్పించి ఒక్క అధికారిక సాక్ష్యం లేకుండా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అని అడుగుతాను.

ఈ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరగడం లేదు అని ఒక్క పోలీస్ అధికారి అయినా చెబుతారా అని అడుగుతాను.

రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరగడం లేదు అని డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? సజ్జనార్ ముందుకు వస్తాడా? ఇంటెలిజెన్స్ ఐజీ ముందుకు వస్తాడా?

బీఆర్ఎస్ నేత‌ల ఆందోళ‌న‌….

తెలంగాణా భ‌వ‌న్ కు పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు రావ‌డంతో పోలీసులు ఇక్క‌డ అత్యుత్సాహ‌న్ని ప్ర‌ద‌ర్శించారు. కేటిఆర్ తో పాటు తెలంగాణా భ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు రాకుండా గేట్లు మూసే ప్ర‌య‌త్నం చేయ‌డంతో అక్క‌డ కొద్దిసేపు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ బీఆర్ ఎస్ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్త చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *