(హైదరాబాద్,న్యూస్ఇన్)

నకిలీ బిల్లులతో ప్రభుత్వ నిధులను డ్రా చేసిన ఇద్దరు ఉపాధ్యాయులకు కోర్టు జైలు శిక్ష విధించింది. దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 92/ 2013 U/s: 403,409,120(B) of IPC లో ఉపాధ్యాయులను దోషులుగా నిర్ధారించింది. నకిలీ మెడికల్ బిల్లులను సబ్మిట్ చేసి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బును ఇద్దరు ఉపాధ్యాయులు డ్రా చేశారు. ఈ కేసులో కోడంగల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి బి. శ్రీరామ్ A-1 H. రగువీర్ కు మూడు సంవత్సరాల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించారు. A-2 H. సత్యనారాయణ రెడ్డి కు ఆరు నెలల జైలు శిక్ష మరియు 500 రూపాయల జరిమానా విధించడం జరిగిందని దౌలతాబాద్ ఎస్సై బి. రాజ్ కుమార్ తెలిపారు.





Leave a Reply