కేటిఆర్ కుసిట్ కొత్త ఆదేశాలు
తప్పుడు ప్రచారం జరుగుతోంది
(హైదరాబాద్,న్యూస్ఇన్)
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పోలీసు విచారణ పూర్తయిన తరువాత సిట్ అధికారి సజ్జనార్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈవిచారణ ద్వారా కేటిఆర్ తో కీలక అంశాలపై సమాచారాన్ని రాబట్టామని వెల్లడించారు. రికార్డుల్లో ఉన్న సాక్ష్యాధారాలతో వాటిని పరిశీలిస్తున్నామని ప్రకటన విడుదల చేశారు. విచారణ అనంతరం పలు సూచనలు కేటిఆర్ కు చేసినట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో సాక్షులను ఎవరినీ సంప్రదించవద్దని లేదా ప్రభావితం చేయవద్దని ఆయనకు సూచించామన్నారు. అలాగే, అవసరమైతే విచారణకు మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని కేటిఆర్ కు తెలియజేశామని పేర్కొన్నారు.
కేటిఆర్ విచారణ కేవలం క్రైమ్ నంబర్ 243/2024కి సంబంధించి మాత్రమే జరిగిందని స్పష్టం చేస్తున్నాము. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు మరియు ప్రముఖులతో సహా వేలాది మంది పౌరుల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ఇంటర్సెప్షన్ (ట్యాపింగ్), నిఘా పెట్టారనే విస్తృత ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది.

ఫోన్ ఇంటర్సెప్షన్ కేవలం భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే జరిగిందని, ఇందులో ఎలాంటి చట్టవ్యతిరేకత లేదని కొన్ని మీడియా వర్గాలు మరియు వ్యక్తులు నిరాధారమైన, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు సంస్థకు ఇటువంటి తప్పుడు కథనాలతో సంబంధం లేదు. ఈ దర్యాప్తు పూర్తిగా చట్టప్రకారం, నిష్పక్షపాతంగా మరియు వృత్తిపరమైన ప్రమాణాలతో జరుగుతోంది.
ఈ నేపథ్యంలో, ధృవీకరించని లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలను కోరుతున్నాము. చట్టబద్ధమైన, అధికారిక మార్గాల ద్వారా వెల్లడించిన వాస్తవాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.






Leave a Reply