ఊపిరి పీల్చుకున్న గులాబీ నేతలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసిఆర్ విచారణ ఆదివారం రాత్రి 7.56 నిమిషాలకు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన విచారణలో భాగంగా సిట్ అధికారులు దాదాపు నాలుగు గంటల పాటు కేసిఆర్ తో ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలను రాబట్టారు. పార్టీ కీలక నేతలు కేటిఆర్, హరీష్ రావ్, సంతోష్ రావు సహా మరికొంత నేతలు, పోలీసు అధికారులు తమ విచారణలో రాబట్టిన అంశాలపై కేసిఆర్ తో క్రాస్ చేక్ చేసి మరిన్ని వివరాలు రాబట్టినట్లు సమాచారం.నిన్నటి ఎంతో ఉత్కంఠకు దారి తీసిన కేసీఆర్ విచారణ అనంతరం అధికారులు వెళ్లి పోవడంతో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున కేసిఆర్ నివాసానికి చేరుకున్నాయి.

కేసిఆర్ విచారణ సందర్బంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలను పోలీసులు అమలు చేశారు. ఉదయం నుంచే నంది నగర్ నివాసం వైపు ఎవరినీ అనుమతించ లేదు. కేసిఆర్ తన వ్యవసాయ క్షేత్రం నుంచి మధ్యాహ్నం 1 గంట సమాయానికి నందినగర్ నివాసానికి చేరుకున్నారు.

అనంతరం సిట్ అధికారులు తమ యంత్రాలను, ఫైళ్లను వాహనాల్లో కేసిఆర్ ఇంటికి తరలించి 3 గంటలకు విచారణ మొదలు పెట్టారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారణ సాగింది. ఈ సమయంలో పలు మార్లు టెన్షన్ వాతావరణం తెలంగాణా భవన్ తో పాటు ప్రాంతాల్లో నెలకొంది. కేసిఆర్ విచారణను నిరసిస్తూ బీఆర్ ఎస్ నేతలు సీఎం రేవంత్ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో పోలీసులు తెలంగాణా భవన్ నుంచి నేతలను బయటకు రానియ్యకుండా గేట్లు మూసి వేశారు. సాయంత్రం 7. 56 నిమిషాలకు విచారణ పూర్తి చేసుకుని అధికారులు వెళ్లి పోవడంతో పార్టీ కీలక నేతలు కేటిఆర్, హరీష్ రావ్ సహా మాజీ పోలీసు అధికారి ఆర్ ఎస్. ప్రవీణ్ కుమార్ కేసిఆర్ నివాసానికి చేరుకుని విచారణ పరిస్థితులపై చర్చించారు.
నేతలకు అభివాదం….

పోలీసుల విచారణ అనంతరం బీఆర్ ఎస్ అధినేత తన నివాసం నుంచి బయటకు వచ్చి పార్టీ క్యాడర్ కు అభివాదం చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు తరలి రావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొద్ది మంది సీనియర్ నేతలను మాత్రమే కేసిఆర్ ను కలిసేందుకు అవకాశం ఇచ్చారు. పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున తమ అధినేత కోసం కంపౌండ్ ముందు వేచి చూశారు. దీంతో కేసిఆర్ బాల్కానీ నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేసి వెళ్లారు.కీలక నేతలను కలుసుకున్న అనంతరం కేసిఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు.



Leave a Reply